BPT: ప్రజల ఫిర్యాదులను ప్రథమ ప్రాధాన్యతతో నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల అర్జీలను ఆయన స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.