KDP: పోరుమామిళ్ల మండలం ఈదులపల్లి పల్లెకు చెందిన లక్కినేని దేవరాజు అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఓ మహిళను శారీరకంగా వాడుకొన్నాడని, ఆమె గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం చేయించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేశామన్నారు.