ATP: పామిడి మండల కేంద్రానికి చెందిన పలువురు మహిళలు బీజేపీలో చేరారు. యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. మండలంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.