• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రభుత్వం ఉల్లి రైతులను మోసగించింది’

KRNL: కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని ఆలూరు MLA బుసినే విరుపాక్షి అన్నారు. బుధవారం ఆస్పరి మండలం యాటకల్లు గ్రామంలో ఉల్లి రైతులతో మాట్లాడారు. రైతులు పడుతున్న కష్టాలను కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఉల్లికి ఒక హెక్టరుకు రూ.50000 ప్రకటించిన రైతులకు ఏమాత్రం సరిపోదన్నారు.

October 1, 2025 / 02:19 PM IST

భక్తిశ్రద్ధలతో ఆయుధపూజ కార్యక్రమం

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో దసరా పండుగ సందర్భంగా బుధవారం ఆయుధ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఇంఛార్జ్ నారాయణస్వామి, చైర్‌పర్సన్ భవాని హాజరయ్యారు. కార్యాలయంలోని వాహనాలకు ఆయుధ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ కార్మికులకు అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యం ఉండాలని ఆకాంక్షించారు.

October 1, 2025 / 02:18 PM IST

మార్కాపురంలో ట్రాఫిక్ జామ్.. కిక్కిరిచిన జనాలు

ప్రకాశం: దసరా పండుగ సందర్భంగా మార్కాపురంలో కిక్కిరిసిన జనాలు. ఈ సందర్భంగా దసరా గురువారం కావడంతో మార్కాపురం చుట్టుపక్కల పల్లెల నుంచి పట్టణానికి నిత్యవసర సరుకుల కోసం పూజ సామాగ్రి తదితర వస్తువుల కోసం భారీగా జనాలు వచ్చారు. ట్రాఫిక్ బాగా ఇబ్బంది కలిగింది. వెంటనే స్పందించిన సీఐ సుబ్బారావు, ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

October 1, 2025 / 02:17 PM IST

విజయదశమి వేడుకల్లో జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవం

VSP: డాబాగార్డెన్స్‌ VJFలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతినిధి బికే రామేశ్వరి మాట్లాడుతూ.. విజయదశమి చెడుపై మంచి సాధించిన పర్వదినమని, దేశవ్యాప్తంగా రావణ దహనం సంప్రదాయం ఉందన్నారు. అక్టోబర్ 2న సాయంత్రం జీవీఎంసీ గాంధీ పార్కులో రావణ దహనం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

October 1, 2025 / 02:15 PM IST

గోవవరంలో BSNL ఉద్యోగుల ర్యాలీ

E.G: స్వదేశీ పరిజ్ఞానంతో అందిస్తున్న 4జీ సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు కోరారు. ఇందులో భాగంగా సంస్థ సిల్వర్ జూబ్లీ సందర్భంగా గోకవరం బస్ స్టాండ్ నన్నయ్య సంచార భవన్ వద్ద బుధవారం బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. కాగా, ర్యాలీలో BSNL ఉద్యోగులు పాల్గొన్నారు.

October 1, 2025 / 02:15 PM IST

సీతారామపురంలో పెన్షన్ పంపిణీ ప్రారంభం

NLR: సీతారామపురం మండలం కురవవీధిలో మారంరెడ్డిపల్లి సొసైటీ ఛైర్మన్ సోమనబోయిన రాజశేఖర్ సమక్షంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది నగదును లబ్ధిదారులకు అందజేశారు. ఇంటి వద్దే ఫించన్ పంపిణీ చేయడంతో అవ్వాతాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

October 1, 2025 / 02:14 PM IST

‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు బ్లడ్ బ్యాంక్’

W.G: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు బ్లడ్ బ్యాంక్ ఎంతగానో ఉపకరిస్తుందని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ బ్లడ్ బ్యాంకును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రాణాలను కాపాడే క్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.

October 1, 2025 / 02:14 PM IST

బి.మఠంలో యాగ శాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: బి.మఠం మండలంలోని పి. కొత్తపల్లెలో కోడూరు దుర్గమ్మ ఆలయంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన యాగ శాలను MLA పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేల్ TDP ఇన్ఛార్జ్ రితేశ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా బసిరెడ్డి రవీంద్రారెడ్డిని అభినందించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు.

October 1, 2025 / 02:11 PM IST

పెన్షన్‌ను పంపిణీ చేసిన మంత్రి

ELR: ఆగిరిపల్లి మండలం అడివి నెక్కలం బుడ్డగూడెం కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్‌ను అందజేశారు. అలాగే లబ్ధిదారుల యోగ క్షేమాలను, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

October 1, 2025 / 01:52 PM IST

దత్తిలో చంద్రబాబు ప్రశ్నల వర్షం

VZM: దత్తిలో గ్రామంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామ అభివృద్ధిపై పంచాయతీసెక్రటరీ త్రినాథ వర్మ వివరిస్తుండగా గ్రామంలో 600 మూగజీవాలు ఉంటే 400 లీటర్ల పాలు ఉత్పత్తి అవ్వడం ఏంటని సీఎం ప్రశ్నించారు. గ్రామంలో ఏఏ వాణిజ్య పంటలు పండుతున్నాయని వివరాలు తెలుసుకున్నారు. అరటి, పామాయిల్ అని పంచాయతీ సెక్రటరీ సమాధానం ఇచ్చారు.

October 1, 2025 / 01:50 PM IST

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి పర్యటన

NDL: దక్షిణ కొరియాలో నాలుగో రోజు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ పర్యటన కొనసాగుతుంది. స్మార్ట్ సిటీల నిర్మాణం అధ్యయనం, పెట్టుబడులే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. సియోల్ సమీపంలో స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్‌పో 2025ను సందర్శించారు. సియోల్ మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎక్స్‌పో నిర్వహించారు. అనంతరం సిటీనెట్ CEO చాంగ్ జే బక్‌తో సమావేశమయ్యారు.

October 1, 2025 / 01:50 PM IST

రామాపురం PHC‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

CTR: రామాపురం మండలం కల్పనాయన చెరువులో ఉపాధి హామీ పథకం కింద నాటిన మామిడి మొక్కలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఈ మేరకు పనులు, పని దినాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి, ఇన్‌పేషంట్‌తో మాట్లాడి వైద్య సేవలపై సమాచారం తీసుకున్నారు. కాగా, వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.

October 1, 2025 / 01:48 PM IST

రాయచోటిలో CMRF చెక్కుల పంపిణీ చేసిన మండిపల్లి

CTR: రాయచోటి నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పెద్ద ఆదరణగా మారిందని డాక్టర్ మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన మేరపూరి ఆదినారాయణకు రూ.53,000, వల్లూరు రజియాకు రూ.40,000 చెక్కులు అందజేశారు. అనంతరం చెక్కులు స్వీకరించిన లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

October 1, 2025 / 01:45 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన DMHO

CTR: కాణిపాకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.టి సుధారాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. తనిఖీ అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సిబ్బంది బాద్యతగా పనిచెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

October 1, 2025 / 01:44 PM IST

రాయచోటిలో ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో బుధవారం జరిగిన అన్నమయ్య జిల్లా మేదర సంఘం అధ్యక్షుడు గుజపనేని వెంకటేశ్వర్లు, నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేదర సంఘం జిల్లా అధ్యక్షులు, కొత్త కార్యవర్గ సభ్యులు మంత్రి గారిని ఘనంగా సత్కరించారు.

October 1, 2025 / 01:43 PM IST