PLD: సత్తెనపల్లి పట్టణంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. జాబ్ మేళాకి అధిక సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
TPT: తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద గల వకుళా మాతా ఆలయం వద్ద ఆదివారం బీజేపీ నాయకులు భక్తులతో కలిసి టెంకాయలు కొట్టి తప్పు చేసిన వారిని శిక్షించాలని మొక్కుకున్నారు. తిరుమల శ్రీవారికి తల్లిగా వకుళా మాతా దేవి నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు. అటువంటి వకుళా మాతా దేవి కళ్ళుగప్పి, అపవిత్రమైన నెయ్యిని వినియోగించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ATP: గార్లదిన్నె మండలంలో సోమవారం ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించనున్నట్లు వారి కార్యాలయం నుండి తెలిపారు. ఉదయం 10 గంటలకు మిడ్ పెన్నర్ రిజర్వాయర్ వద్ద పూజలు నిర్వహించి, కెనాల్కు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం గార్లదిన్నెలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.
WG: విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ దాతలు విరాళాలు అందిస్తున్నారు. తణుకు మండలం వీరభద్రపురంలో బెతేల్ అసెంబ్లీ చర్చ్ తరుపున సీఎం సహాయనిధికి రూ.2 లక్షలు విరాళాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు సభ్యులు చెక్కును ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అభినందించారు. బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలన్నారు.
NLR: దగదర్తి మండలం ఇక నుంచి కావ్య కృష్ణారెడ్డిదని, ఈ మండలంలో కష్టపడే ప్రతి కార్యకర్తను ఆదుకునే బాధ్యత తనదని, ఏ కష్టమొచ్చినా 365 రోజులు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. దగదర్తి మండలం చెన్నూరులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
GNTR: జగన్ ఇంటిపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని వైసీపీ నేత మూర్తి అన్నారు. తాడేపల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇది ‘పిరికి పంద చర్య’ అని అన్నారు. చంద్రబాబు లడ్డు చిచ్చు పెట్టాడని, ఆయన వాఖ్యలతో బీజేపీ ముసుగులో జగన్ ఇంటిపై దాడి చేయటం దారుణమన్నారు. కూటమిలో బాగస్వామిగా చంద్రబాబు నిగ్గు తేల్చాసింది పోయి, మాజీ సీఎం ఇంటిపై దాడిచేయిస్తున్నారని అన్నారు.
KDP: మైదుకూరు పట్టణంలోని శాంతినగర్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఘనంగా స్త్రీల మైత్రి కూడిక నిర్వహించారు. సంఘ గురువు రెవరెంట్ శామ్యూల్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ డయాసిస్ ప్రెసిడెంట్ భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్త్రీలకు దేవుని వర్తమానాన్ని అందించారు. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి పరిష్కారాలు వివరించారు.
VSP: విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో గాజువాక మండలం అగనంపూడి వద్ద కార్మికులు ఆదివారం ధర్నా చేపట్టారు. 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడపాలన్నారు. నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.
PLD: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన గంగరాజు(30) కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
NLR: ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో రైతుల పండించిన సజ్జ పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని బండగానిపల్లి పంచాయతీ కృష్ణారెడ్డి పల్లిలో ఆందోళన చేపట్టారు. రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే సజ్జలు కొనుగోలు చేసి సరైన గిట్టుబాటు ధరను అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ASR: అరకులోయ మండలంలోని సుంకర మెట్ట పరిధిలోని గాలి కొండ వ్యూ పాయింట్ సమీపంలో మలుపు వద్ద ఆదివారం 108 అంబులెన్స్కి ప్రమాదం జరిగింది. 108 డ్రైవర్ లోడ్ తో వెళ్తున్న బెంజ్ లారిని తప్పించబోయి మలుపు వద్ద బండరాయిని ఢీకొట్టడంతో అంబులెన్స్ ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. ఎవ్వరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.
SKLM: ఎచ్చెర్లలలో ఓ విద్యుత్ స్తంభానికి దట్టంగా పాదులు అలుముకున్నాయి. దీంతో తరచూ ట్రిప్ అవుతూ విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ వినియోగదారులు అంటున్నారు. అదేవిధంగా వర్షాలు కురిసేటప్పుడు ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పాదులను తొలగించాలని వారు కోరుతున్నారు.
PLD: గ్రామంగా ఉన్న గురజాలను రెవెన్యూ డివిజన్గా మార్చడమే తమ ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం గురజాలలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పల్నాడు జిల్లాకు గురజాలను కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తామన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు.
KDP: సిద్దవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం కృష్ణ కార్తీక్ హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. గ్యాస్ట్రో, లివర్ సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా వైద్య సేవలు అందించి, మందులు పంపిణీ చేశామన్నారు. వివిధ సమస్యలతో బాధపడే 87 మంది వైద్యం తీసుకున్నారని తెలిపారు.
NLR: విజయవాడ వరద బాధితులకు ఆదివారం నెల్లూరు రూరల్ పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వారు ముఖ్య మంత్రి సహాయ నిధికి మూడు లక్షల రూపాయలు చెక్కును రూరల్ ఎమ్మెల్యే కోట రెడ్డి శ్రీధర్ రెడ్డికి అందించారు. వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కూడా విపత్తుల సమయంలో అనేక సహాయాలు చేశారని కొనియాడారు.