• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కోయిలకుంట్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా ఎంపిక

NDL: కోయిలకుంట్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా జి. మధులత ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని మధులత అన్నారు. మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

October 5, 2025 / 06:12 PM IST

మహిళలకు నెలకు రూ.1500.. కూటమి ప్రభుత్వం కసరత్తు

KDP: రాష్ట్రంలో మహిళలకు కూటమి సర్కార్ త్వరలో శుభవార్త చెప్పనుంది. సూపర్ సిక్స్ హామీలలో ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. మహిళలకు సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. మరోవైపు ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.3,300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

October 5, 2025 / 06:10 PM IST

జిల్లాలో గంజాయి స్వాధీనం

ASR: పెదబయలు మండలంలోని సీకరి పంచాయతీ బొడ్డాపుట్టు గ్రామ సమీపంలో 502 కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్సై కొల్లి రమణ ఇవాళ తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా జీపుపై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.

October 5, 2025 / 06:09 PM IST

తీగలేరు వాగులో గుర్తు తెలియని మృతదేహం

ప్రకాశం: దోర్నాల మండలం రామచంద్రకోట గ్రామ సమీపంలో తీగలేరు వాగులో గుర్తు తెలియని మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

October 5, 2025 / 06:09 PM IST

బస్సులో రూ. 95 వేలు చోరీ

KDP: పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగులోని రూ. 95 వేలు నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన ఇవాళ చోటుచేసుకుంది. మార్కాపురం గ్రామానికి చెందిన గురుభారతి అనే మహిళ బద్వేలులో రూ. 95 వేలు తీసుకుని మార్కాపురానికి తిరిగి వెళ్లేందుకు గిద్దలూరు బస్సు ఎక్కుతున్న సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు బాధితురాలు తెలిపారు.

October 5, 2025 / 06:08 PM IST

పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్

ELR: పెదవేగి మండలం న్యాయంపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై సీఐ రాజశేఖర్ ఆదివారం ఆకస్మిక దాడులు చేశారు. సీఐ మాట్లాడుతూ.. తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామన్నారు. ఐదుగురు జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. రూ. 9,300 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

October 5, 2025 / 06:06 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు

CTR: వెదురుకుప్పం మండలంలోని పచ్ఛికాపల్లం పరిధిలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లో మృతి చెందగా  ఒకరికి త్రీవ గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైనవారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

October 5, 2025 / 06:04 PM IST

‘విజ్ఞానపన సభను జయప్రదం చేయాలి’

WG: ఈ నెల 11న విజయవాడలో జరిగే విజ్ఞానపన సభను జయప్రదం చేయాలని ఎంటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లంగి కేశవ కుమార్, రాష్ట్ర కో ఆర్డినేటర్లు రాజా లింగం, అనిల్ అరవింద్ కుమార్ అన్నారు. ఆదివారం భీమవరం లూథరన్ హైస్కూల్లో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. 1998 ఎంటీఎస్ గత 25 ఏళ్లుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని, టెంపరరీ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలన్నారు.

October 5, 2025 / 06:03 PM IST

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం

KKD: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జిల్లా స్థాయిలో రేపు జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో యథావిదిగా జరుగుతుందని కలెక్టర్ షాణ్ మోహన్ సగిలి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీలు రూపంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు.

October 5, 2025 / 06:01 PM IST

‘దేశం, ధర్మం కోసమే RSS పనిచేస్తోంది’

W.G: దేశం, ధర్మం కోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తున్నదని గోదావరి విభాగ్ కార్యకరిణి మురళి కృష్ణ అన్నారు. విజయదశమికి RSS ఏర్పడి 100 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం ఆకివీడులో ఖండ సమావేశం జరిగింది. హిందువులందరూ ఐకమత్యంతో దేశం కోసం, ధర్మం కోసం నిలబడాలన్నారు. కుల మతాలకతీతంగా హిందువులందరూ సంఘటితమవ్వాలని పేర్కొన్నారు.

October 5, 2025 / 06:00 PM IST

ఘోరం.. ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

అన్నమయ్య: జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సంబేపల్లి వద్ద చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకరు మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన యువకుడుకాగా, మరొకరు సంబేపల్లెకు చెందిన బంధువుల కుమారుడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 5, 2025 / 05:59 PM IST

‘డీజే సౌండ్ సిస్టం ఓనర్లకు వార్నింగ్’

ప్రకాశం: డీజే సౌండ్ సిస్టం అద్దెకు ఇచ్చే యాజమాన్యాలకు గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ వార్నింగ్ ఇచ్చారు. అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టం అద్దెకు ఇచ్చిన ఉపయోగించిన చర్యలు తప్పవని ఆదివారం మీడియాకు సురేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి డీజే సౌండ్ సిస్టం అద్దెకు ఇచ్చే వారి డీజే సౌండ్ సిస్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని హెచ్చరించారు.

October 5, 2025 / 05:54 PM IST

లింగాలపాడులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

NTR: నందిగామ మండలం లింగాలపాడు గ్రామం ZPHS హైస్కూల్ ఆవరణంలో NRM హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మధుమేహ (షుగర్) వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్యశిబిరం నందు 152 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించి, మందులు పంపిణీ చేశారు. BSP రాష్ట్ర కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజు పాల్గొని మాట్లాడుతూ.. బీపీ, షుగర్, ఆర్తో, ఈసీజీ మొదలగు పరీక్షలు ఉచితంగా చేశామన్నారు.

October 5, 2025 / 05:53 PM IST

‘విద్యార్థినిల ఆరోగ్యం నిలకడగా ఉంది’

PPM: కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 37 మంది విద్యార్థినిల్లో ముగ్గురు ICUలో, మిగిలిన వారు జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని జాండిస్, జ్వరానికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారని వెల్లడించారు. హెపటైటెస్-ఏ లోపం కూడా గుర్తించారని దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా వేస్తామన్నారు.

October 5, 2025 / 05:51 PM IST

‘ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం’

E.G: ప్రకృతి వ్యవసాయం అమలులో మహిళల పాత్ర అభినందనీయమని బ్రెజిల్ బృందం ప్రశంసించింది. ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే క్రమంలో బ్రెజిల్, UAE, శ్రీలంకకు చెందిన 30 మంది ప్రతిష్టాత్మక నిపుణుల బృందం ఇవాళ కాపవరం, కురుకూరు, ఎర్నగూడెం గ్రామాలను సందర్శించింది. ఈ పర్యటన రైతు సాధికార సంస్థ, నౌ భాగస్వాములు సంయుక్తంగా నిర్వహించారు.

October 5, 2025 / 05:50 PM IST