కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో MBA మరియు MCA కోర్సులు చదువుతున్న Y21-Y24 బ్యాచ్ విద్యార్థులకు 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. విద్యార్థులు ఎటువంటి జరిమానా లేకుండా అక్టోబర్ 15 లోపు, రూ.200 జరిమానాతో అక్టోబర్ 18 లోపు పరీక్ష రుసుము చెల్లించాలి.