అన్నమయ్య: ప్రజలను కనువిందు చేసేందుకు టైటానిక్ ఎగ్జిబిషన్ అన్ని హంగులతో సిద్ధంగా ఉందని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. ఈ మేరకు ఇవాళ టిప్పు సుల్తాన్ మైదానం నందు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. కాగా, ఇంటిళ్లపాదిగా సందర్శించి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి యజమాని సీ.కే. దినేష్ కుమార్, కో- ఆర్డినేటర్ కె, వేణుగోపాల్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.