W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో జిల్లా ప్రకృతి వ్యవసాయ డిస్ట్రిక్ ప్రాజెక్టు మేనేజర్ నూకరాజు, ప్రకృతి వ్యవసాయం డిస్టిక్ కోఆర్డినేటర్ అరుణ కుమారి ఆధ్వర్యంలో సోమవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 50 లీటర్ల అగ్నిస్తం కషాయాన్ని తయారు చేశారు. ఇది వరిలో వివిధ రకాల పురుగుల నివారణకు ఉపయోగపడుతుందన్నారు.