CTR: చిత్తూరులో ప్రముఖ డీ-మార్ట్ స్టోర్ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ట్రయల్ రన్ అనంతరం శనివారం డీ-మార్ట్ స్టోర్ను రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ప్రముఖ వ్యాపార సంస్థలు తమ స్టోర్లను ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. ఈ మేరకు నగరవాసులకు తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువుల లభిస్తాయన్నారు.