ప్రకాశం: గుంటూరు- గుంతకల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా గిద్దలూరు మీదుగా వెళ్లే గుంటూరు-డోన్ రైలు (17228)ను పది రోజులపాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే డోన్- గుంటూరు రైలును ఈనెల 17 నుంచి 27 వరకు రద్దు చేశారు.
W.G: మాజీ సీఎం జగన్ రైతుల ద్రోహి అని మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. శనివారం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం శాఖకు సంబంధించిన డోర్స్, రిప్స్కు గ్రీజ్ పెట్టలేని దుస్థితిని గత ప్రభుత్వంలో చూశామన్నారు. ఇరిగేషన్ శాఖకు రూ.18 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతుందన్నారు.
KRNL: ఓర్వకల్లు మండలం శకునాలలో తహసీల్దార్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సాగునీటి సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. నామినేషన్లు టీడీపీ మద్దతుదారులు ఒకరే వేయడంతో నీటి సంఘం ఎన్నిక ఏకగీవ్రమైంది. సాగునీటి సంఘం అధ్యక్షుడిగా గణశ్యాంసుందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడుగా ఆకుల లక్ష్మయ్యతో పాటు సభ్యులు పుల్లయ్య, బీ. రాముడు, ఎం. రాముడు, వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
VZM: విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యం నాయుడు అన్నారు. బాబా మెట్టలోని కేంద్రీయ విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
W.G: పాలకొల్లులోని ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాస్ డ్రగ్స్పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి, నాటు సారా, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలని ప్రభుత్వం, శాఖ పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు యువత సహకారం కావాలన్నారు. మత్తు పదార్థాల విక్రయాలు జరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం రాయచోటికి రానున్నారని మంత్రి కార్యాలయం తెలిపింది. మంత్రి ఆదివారం ఉదయం 6:30 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొంది.
W.G: పాలకొల్లు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) షేక్ జియోద్దీన్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్లో సివిల్, క్రిమినల్, బెంచ్ కేసులు మొత్తం 213 కేసులు రాజీ చేసారు. ఇందులో ఐపీసీ కేసులు -90, ఎక్సైజ్ కేసులు -32, ప్రామిసరీ నోట్ కేసులు -33, ఎగ్జిక్యూటివ్ పిటిషన్ కేసులు -3, ఫైనల్ డిక్రీ కేసు -1, పరిష్కారం అయినట్లు తెలిపారు.
SKLM: పోలాకి మండలంలో జడూరు గ్రామంలో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శనివారం రాత్రి వ్యభిచార గృహంపై దాడి చేశారు. అప్పటికే అక్కడ ఉన్న ఓ మహిళను, విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నిర్వాహకులను అరెస్టు చేసినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.
VSP: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు జిల్లా పర్యటనకు రానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నగరంలోని సంపత్ వినాయనగర్, సింహాచలం దేవస్థానం పాలకమండలి ఛైర్మన్తో భేటీ కానున్నారు. అనంతరం సింహాచలం అప్పన్నస్వామి, కనకమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొనున్నారు.
ELR: డిసెంబర్ 16న సీఎం చంద్రబాబు పోలవరం చేరుకుంటారని కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డయాఫ్రమ్ వాల్ తదితర ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని, అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారని అన్నారు. ఈ సందర్భంగానే అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
VZM: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా బి.సి. సంక్షేమ శాఖ అధికారి పెంటోజీ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి అమరజీవికి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు వెల్లడించారు.
ASR: ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి అందాలు ఎంతో బాగున్నాయని డ్వామా పీడీ డా. విద్యా సాగర్ అన్నారు. శనివారం చింతపల్లి మండలం లంబసింగిలో పర్యటించారు. మంచు అందాలు ఆస్వాదించారు. చెరువులవేనం వ్యూ పాయింట్ వద్ద సందర్శించారు. తాజంగి జలాశయంలో బోటు షికారు చేశారు. ప్రకృతి అందాలు ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటలను పరిశీలించారు.
ప్రకాశం: మార్కాపురం పరిధిలోని బోడపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-ఒంగోలు హైవే పై శనివారం బైక్ను, ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
TPT: ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్పపీడం ఏర్పడనుందని రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తిరుపతిలోను ఈనెల 17, 18 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ప్రకాశం: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా సౌత్ జోన్ ఇండియా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ముండ్లపాడు సెయింట్ జేకబ్స్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పాల్గొనాలనుకునే వారు ఈ నెల 20లోపు పేర్లను నమోదు చేసుకోవాలని, ఎంట్రీ ఫీజు రూ. 500 చెల్లచాలన్నారు.