ATP: గుత్తి పట్టణంలోని ఏడీజే, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీజే శ్రీహరి, సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ్ అన్ని రకాల కేసులు కలిపి మొత్తం 530 కేసులను పరిష్కరించమని తెలిపారు.
ATP: పామిడి మండలం జి కొట్టాల గ్రామానికి చెందిన రైతు సుదర్శన్ గడ్డివాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పామిడి ఎస్సై సుధాకర్ యాదవ్ శనివారం తన సొంత ఖర్చుతో 5 ట్రాక్టర్ల గడ్డివామును రైతుకు అందజేశారు. ఎస్సై మాట్లాడుతూ.. ఓ రైతు ఆవేదనను అర్థం చేసుకునీ రైతుకు సొంత ఖర్చులతో రూ.లక్ష 50 వేల గడ్డివామును అందజేశామన్నారు.
సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే MS రాజు ఇటీవల కూటమి ప్రభుత్వం టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించింది. టీటీడీ సభ్యులుగా మరింత భక్తిశ్రద్ధలతో నిష్ఠతో ఉండాలనే ఉద్దేశంతో శనివారం గోవింద మాలధారణ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ సభ్యులుగా ఎన్నికైనందుకు గొప్ప అదృష్టంగా భావించి శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణం చేసుకుంటూ టీటీడీ అభివృద్ధికి మరింత కృషి చేస్తాననారు.
సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని బాబయ్య స్వామి దర్గా ఉరుసు సందర్భంగా పోలీస్ భద్రత ఏర్పాట్లును జిల్లా ఎస్పీ వి.రత్న శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాబయ్య స్వామిని ఎస్పీ దర్శించుకున్నారు. భక్తులుకు ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ, సీఐ పాల్గొన్నారు.
సత్యసాయి: అమరావతిలోని ఏపీ సచివాలయం నందు శనివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను టీడీపీ సీనియర్ నాయకుడు BVV రాముడు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీసత్యసాయి జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
NLR: నెల్లూరు జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కరించే దిశగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగులు వేస్తున్నారని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నిరుద్యోగ సమస్యను అధిగమించేలా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రారంభించారన్నారు. ఎంపీగా వేమిరెడ్డి రావడం జిల్లా ప్రజలకు శుభపరిణామమని అన్నారు.
ASR: జీ.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. వీకెండ్ రెండవ శనివారం కావడంతో జలపాతం అందాలను చూసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. శనివారం రాత్రి కూడా జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. సుందరీకరణ పనుల్లో భాగంగా జలపాతం వద్ద విద్యుద్దీపాలు అలంకరణ చేశారు. విద్యుత్ కాంతులీనుతూ జలపాతం అందాలు మరింత కనువిందు చేశాయి.
ASR: జీ.మాడుగుల మండలం గెమ్మెలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం 87 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కే.బాబ్జీ తెలిపారు. వారిలో ఆపరేషన్ కోసం వచ్చిన 83 మందికి విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు.
TPT: కపిలతీర్థం వద్ద ఉన్న రాజ్ పార్క్ హోటల్ వేదికగా ‘ఫౌండేషన్ ఫర్ యూత్ అడ్వాన్స్మెంట్’ ఆధ్వర్యంలో ఆదివారం, సోమవారం “ఎడ్యుకేషన్ ఫెయిర్” నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఉపాధ్యక్షులు తూపల్లి నందకిషోర్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు, తదితరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
TPT: డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం ఈనెల 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలు (ఫోన్ నం.0877- 2263261) టీటీడీ ఈవో జె. శ్యామలరావుకు తెలపాలని అధికారులు కోరారు. కావున ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
CTR: అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతి సభ ఆదివారం ఉదయం 10.30 గంటలకు స్థానిక గంగినేని పార్కు వద్దనున్న పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద జరగనుంది. ఈ విషయాన్ని పొట్టి శ్రీరాములు విగ్రహ స్థాపన కమిటీ ఉపాధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
CTR: కుప్పంలో ఎన్జీవో హోమ్లో మంగళవారం జాతీయ పింఛనర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు పీజీ సెల్వం, ప్రధాన కార్యదర్శి గణేష్ పిళ్లై సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో పింఛన్ దారులను సన్మానించనున్నట్లు తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి, పింఛన్ దారులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
PPM: పార్వతీపురం నియోజకవర్గంలో సాగునీటి సంఘ చైర్మన్లు, మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అభినందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పలువురు చైర్మన్లు, మెంబర్లు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఎమ్మెల్యే అభినందించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆదరణ లభిస్తుందని నీటి సంఘాలు పేర్కొన్నారు.
E.G: దేవరపల్లిలో కులమతాలకు అతీతంగా నియోజకవర్గ స్థాయిలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి నియోజకవర్గ ప్రజలు ఈ వేడుకలకు హాజరు కావాలని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
KRNL: పార్లమెంట్లో రాజ్యాంగంపై జరిగిన చర్చలో భాగంగా గత ఐదేళ్లలో ఏపీలో చీకటి పాలన జరిగిందని నంద్యాల MP డా. బైరెడ్డి శబరి విమర్శించారు. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా సొంత రాజ్యాంగంతో పాలించి, ప్రతి రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇవన్నీ భరించిన ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని గెలిపించారని, జగన్ని ప్రజలు ఇంటికి పంపించారని శబరి ఆరోపించారు.