త్వరలో విశాఖపట్నం భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు సంబంధించి ఢిల్లీలో జరిగిన సన్నాహక సదస్సు వివరాలను వెల్లడించారు. 49 దేశాలకు చెందిన ప్రతినిధులు, అసోచామ్, ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్ ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో...
ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా రొంపిచర్లలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాల కోటిరెడ్డిపై కాల్పులు జరిగాయి. రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డికి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనప్రాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది ఎవరో తెలియడం లేదు. రాజకీయ కక్షతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టా...
తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అని, అక్కడకు తాను షిఫ్ట్ అవుతున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మూడు రాజధానులపై స్పందిస్తున్నారు. జగన్ ఢిల్లీలో కొత్తగా ఏమీ చెప్పలేదని, ఎప్పుడూ చెప్పేదే చెప్పారన్నారు. సుప్రీం కోర్టు కూడా తమకు రాజధానిపై శాసనాధికారం లేదంటే, కేంద్రం ప్రభుత్వంతో బిల్లు...
ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం కలిశారు. ఈసందర్భంగా మాట్లాడిన నిక్.. సీఎం జగన్ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎంను పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను కానీ.. ఎక్కడ కూడా ఏపీలో అవలంభిస్తున్న విధానాలను పాటించడం లేదని, ఇక్కడ ఎంతో స్ఫూర్తిదా...
పాదయాత్ర ఇప్పుడు అందరికీ ఓ ఫ్యాషన్గా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఉద్దేశించి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే, వారు ఆదరిస్తారు, గౌరవిస్తారని, కానీ జగన్ హయాంలో ఏపీ సంతోషంగా ఉందని చెప్పారు. ఇలాంటప్పుడు పాదయాత్ర చేస్తే ఎవరూ హర్షించరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అ...
నందమూరి తారకరత్న మొత్తానికి మృత్యుంజయుడయ్యాడు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడని డాక్టర్లు తెలిపారు. అయినా ఇంకా ఆయనకు పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో ట్రీట్ మెంట్ చేస్తున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకొచ్చే వరకు తారకరత్న కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. బెంగళూరు ఆసుపత్రిలో చేర్చిన రెండు రోజుల తర్వాత తారకరత్న కోలుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ల...
కేంద్ర బడ్జెట్ 2023 పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని స్పష్టం చేశారు. అలాగే.. ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు కూడా ఊరటనిచ్చాయన్నారు. కొన్ని సెక్టార్లకు తక్కువ కేటాయింపులు చేశారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి ఈస...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను డైమండ్ రాణి అంటూ ఎద్దేవా చేయడం పట్ల మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రంగా స్పందించారు. ప్రతిగా లోకేష్ అంకుల్ అంటూ విరుచుకుపడ్డారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారో, తాము మళ్లీ వస్తే ఏం చేయనున్నారో చెప్పకుండా పాదయాత్ర అంటూ నడవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దోచ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణం అని సీఎం జగన్ చేసిన కామెంట్స్పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షాలు సీఎం జగన్ వైఖరిని తప్పుపడుతున్నాయి. దేవినేని ఉమ అయితే వైఎస్ వివేకా కేసును సీబీఐ స్పీడప్ చేసిందని, దృష్టి మరల్చేందుకు రాజధాని అని కామెంట్ చేశారని విమర్శించారు. వైసీపీ మంత్రులు/ నేతలు జగన్ కామెంట్స్ను సమర్థిస్తున్నారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీ రాజధాని ఏది అని గూగుల్...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డి పల్లె మండలంలో పలువురితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సాకే గ్రామంలో చెరకు రైతు వెంకట రమణ తన బాధను చెప్పుకున్నారు. ఒకటిన్నర పొలం, బెల్లం గానుగ చూపించి ఇబ్బందులను తెలిపారు. చెరకు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని లోకేశ్ మండిపడ్డారు. ‘వైసీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగ...
సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాపింగ్ లను కాదని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి వ్యవహారం, నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై నోరు విప్పారు. చద...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. లోకేశ్ బస చేసిన ప్రదేశానికి వచ్చి బీభత్సం సృష్టించారు. టీడీపీ ఫ్లెక్సీలు చించేసి రచ్చ చేశారు. అనంతరం తెలుగు తమ్ముళ్లపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల...
ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ భారీ కుదుపు కుదిపింది. రెండు రోజులుగా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం బహిర్గతం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆడియోలను విడుదల చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? అని నిలదీశారు. అనుమానం ఉన్న చోట తాను ఉండలేను అని ప్రకటించారు. ‘ప్రజా సమ...
కామం మైకంలో అభం శుభం తెలియని బాలికపై కామాంధుడు ఎగబడ్డాడు. అతడి పైశాచిక ప్రవర్తనకు భయాందోళనకు గురైన బాలిక బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అయినా వదల్లేదు. తలుపులు పగులగొట్టి బాలికను పట్టుకున్నాడు. కేకలు వేస్తుండడంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాలిక నోట్లో యాసిడ్ పోసి అతి క్రూరంగా ప్రవర్తించాడు. యాసిడ్ బాధకు విలవిలలాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక కన్నుమూసి...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. గత ఐదు రోజులుగా 58.5 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. పలమనేరు నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. లోకేశ్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీ దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు దిష్టి తీసి, తిలకం దిద్ది, హారతి పట్టారు. నియోజకవర్గంలో వ్యవసాయ భూములను లోకేశ్ పరిశీలించారు. పొలాల్లో పనిచేస్తు...