తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య కాస్త తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ తగ్గడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి వున్నారు. స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే రూ.300ల టికెట్ గల భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని అధికారు...
ఏపీలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై సొంత పార్టీ నాయకులే తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఈ ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా అలుముకుంది. పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు ఇది బహిర్గతమవుతోంది. అందుకే తరచూ మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్య...
ఏపీలో మూడు రాజధానుల అంశం పై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది. మరోవైపు రాజధాని అంశంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలయింది. శివరామకృష్ణ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు ఒక తీగా దొరికినట్లుగా తెలుస్తుంది. అది తాడేపల్లికి కనెక్ట్ అయినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. వీటి ఆధారంగా కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున...
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానాలలో పర్యటనలు చేస్తున్నారని, కానీ ప్రత్యేక హోదా మాత్రం తేవడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకు వస్తానని పదేపదే చెప్పారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా హోదా మాట లేదని మండిపడ్డా...
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. తన తమ్ముడికి నియెజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని చెప్తోందని ఆయన ఆరోపించారు. తన తమ్ముడు గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను నిలబడబోనని స్పష్టం చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తో తన మనసు కలత చెందిందన్నారు. కంటి నిండాకునుకు లేకుండా చేస్తోందని వాపోయ...
షార్ట్ సర్క్యూట్ కారణంగా అమర్రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, జాతీయ రహదారిపై కలకలం రేపింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడగా.. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మోర్దానపల్లెలో జాతీయ రహదారి పక్కన అమర్రాజా ఫ్యాక్టరీ ఉంది. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పరిశ్రమలో బ్యాటరీలు తయారు చేస్తుంటారు. సోమవ...
నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని చిలకలూరిపేట దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు టిడిపి నాయకులు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు.తా రకరత్న త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకున్నట్లు చెప్పారు. అతను ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని, అలాంటి యువత రావాలన్నారు. అలాగే సినిమా పరిశ్రమలో ఆయన అవసరం ఎంతో ఉందన్నారు. హీరోగా పలు చిత్రాలు నటించి, ...
ఏపీ స్పోర్ట్స్ శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులైనట్లు వెల్లడించింది. ఆర్కే రోజాతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం దక్కింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాయ్ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కొన...
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని రామకృష్ణాపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ వల్ల పాఠశాలలో చదువుతున్న 130 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థఆనికంగా కలకలం రేపింది. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న బాలికలు వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో బ...
ఏపీ సీఎం వైఎస్ జగన్ సాయంత్రం డిల్లీకి బయలుదేరగా.. ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యతో తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయిన విషయం తెలిసిందే. అత్యవసరంగా గన్నవరంలో లాండింగ్ చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్ అధికారులపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఏం చేస్తున్నారు అంటూ జగన్ సీరియస్ అయ్యారు. జీఏడీ, సీఎంవో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విమానంలో సాంక...
తిరుమల తిరుపతి దేవస్థానంలో నయా దందా బయటపడింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలంటే రూ.300 చెల్లించాలి. దాన్ని సుపథం ఎంట్రీ అంటారు. దాని కోసం ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. రూ.300 విలువైన టికెట్లను అక్రమంగా ఎక్కువ ధరకు అమ్ముకొని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అందులో టీటీడీ ఉద...
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరినా ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ చేశారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే సీఎం జగన్ ఉండిపోయారు. రేపు గ్లోబర్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో సీఎం పాల్గొనాల్సి ఉంది. అందుకే మరో ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం జగన్ ...
ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో తిరిగి విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన వల్ల సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. సీఎం జగన్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం...
ఈనెల 27 న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఆరోజు కుప్పంలో చికిత్స చేసి రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. అక్కడికి వెళ్లాక ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. తారకరత్నను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు. నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. తారకరత్న...