NLR: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టౌన్, రూరల్ డిఎస్పీలు, సీఐలతో గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్, రౌడీయిజం మీద కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులను అభినందించారు. తన తరఫునుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
GNTR: @ అమరావతిని తిరిగి రాజధానిగా అభివృద్ధి చేయడం. @ఎలక్షన్ సమయంలో నరసరావుపేట, మాచర్ల పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు. @గుంటూరు నుంచి పెమ్మసాని కేంద్రమంత్రిగా ఎంపిక. @వినుకొండలో నడిరోడ్డుపై రషీద్ దారుణ హత్య. @అక్టోబర్లో కృష్ణానది ఉగ్రరూపం, బోటు ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసం. @ఆస్తి కోసం అన్నదమ్ములను సోదరి హత్య చేయడం. @ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్లు.
E.G: విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీలను రాజమండ్రి కేంద్ర కారాగారానికి బదిలీ చేస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్ బాబు శనివారం తెలిపారు. ఇక్కడ ఖైదీల సంఖ్య పెరగడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీని సామర్థ్యం 914 కాగా, ప్రస్తుతం 2,080 మంది ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. 200 మంది ఖైదీలను రాజమండ్రి కారాగారానికి బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
అన్నమయ్య: విషం తాగి భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్రంకొండ ఎస్సై మధురామ చంద్రుడు తెలిపారు. తరిగొండ గ్రామం బొడ్డువారిపల్లెకు చెందిన నూరుఖాన్(35) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబ సమస్యలు కారణంగా శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో, కుటుంబీకులు బాధితుడిని 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం: మండలం కేంద్రమైన సంతమాగులూరులోని గ్రంథాలయ శాఖలో ఆదివారం లైబ్రేరియన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్పై శిక్షణ ఇచ్చారు. అనంతరం క్విజ్, డిబేట్, వ్యాస రచన వంటి పోటీలు నిర్వహించారు.
NLR: నెల్లూరు రూరల్ మాగుంట లేఅవుట్ సమీపంలో ఉన్న చిన్న బ్రిడ్జ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆత్మకూర్ బస్టాండ్ నుంచి అన్నమయ్య సర్కిల్ వద్దకు వస్తున్న ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి కింద ఉన్న కాలువలో పడిపోయింది. ఇదే సమయంలో పక్కనే ఓన్న మరో బైక్ సైతం అదే కారును ఢీకొట్టడంతో కాలువలో పడింది. ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
NLR: నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి స్కూలు విశ్రాంత హెచ్ఎం వనజపై విచారణకు డీఈఓ బాలాజీరావు ఆదేశించారు. విచారణ అధికారిగా నెల్లూరు ఎంఈఓ తిరుపాలును నియమించారు. వనజపై పలు అభియోగాలతో సురేంద్ర రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ జరిపి ఈ నెల 31వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని డీఈఓ ఆదేశించారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గంగమ్మ దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. మొదట అమ్మవారిని అభిషేకించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ధ్వజస్తంభం వద్ద అమ్మవారికి టెంకాయలు కొట్టి భక్తులు కోర్కెలను తీర్చమని మొక్కుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ పూజారి తీర్థప్రసాదాలు అందజేశారు.
CTR: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 126 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ కోటేశ్వరయ్య, వీరయ్య తెలియజేశారు. డిగ్రీ కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 165 మంది పాల్గొనగా అందులో 126 మంది విద్యార్థులకు సంబంధిత కంపెనీ వారు ధ్రువీకరణ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.
NTR: తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు నేటి కార్యక్రమాలను ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు తిరువూరులో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బాపులపాడు సమీపంలోని హనుమాన్ జంక్షన్లో నిర్వహించనున్న వరల్డ్ మాదిగ డే కార్యక్రమంలో అనంతరం ఎంటర్ ప్రీమియర్ సమ్మిట్లలో పాల్గొంటారు.
VZM: రాజకీయాల్లో పలకరింపులు సహజమని బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి కొండపల్లి తన కాళ్లకు నమస్కారం చేశారనే ఆరోపణలపై బొత్స స్పందించారు. లోకేశ్ తనకి షేక్ హ్యాండ్ ఇచ్చారని, పవన్ కళ్యాణ్కు ఎదురుగా వెళ్లి కలిశారని.. అవన్నీ సహజమన్నారు. ఎయిర్ పోర్టులో బండారు, పల్లా, కలిశెట్టి కలిశారని అందులో తప్పేముందన్నారు.
ASR: కొయ్యూరు మండలం బాలారం పంచాయతీలో మూడు రోజుల నుంచి సెల్ సిగ్నల్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ అప్పలనర్స ఆదివారం తెలిపారు. పాత బాలారం గ్రామంలో ఏర్పాటు చేసిన టవర్ తరచూ మరమ్మతులకు గురవుతూ సెల్ సిగ్నల్స్ నిలిచిపోతున్నాయని అన్నారు. దీంతో సుమారు 6 పంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు సమస్య పరిష్కరించాలని కోరారు.
ప్రకాశం: గుడ్లూరు గ్రామాన్ని ఆదివారం దట్టమైన పొగమంచు కప్పివేసింది. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల క్రితం వరకు వర్షాలు కురిసి శనివారం తెరపిచ్చాయి. ఆదివారం తెల్లవారుఝాము నుంచి దట్టమైన పొగమంచు అలుముకుని ప్రకృతి ప్రేమికులకు మనోల్లాసం కలిగించింది. ఉదయం 8 గంటలైన కూడా పొగమంచు ప్రభావం వీడకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అనంతపురం రోడ్డులో రెండు వేరువేరు ప్రాంతాలలో సత్యసాయి తాగునీటి పైప్ లైన్ డ్యామేజీ అయింది. దీంతో నీరంతా వృథాగా పోవడంతో మున్సిపాలిటీకి నీటి సరఫరా నిలిచిపోయింది. కమిషనర్ జబ్బార్ మియా స్పందించి వాటర్ వర్క్స్ సిబ్బంది చేత ప్రాతిపదికను పైప్ లైన్ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ మేరకు మరమ్మతు పనులను కమిషనర్ పర్యవేక్షించారు.
కడప: మాజీ మంత్రి MLC రామచంద్రయ్య తనయుడు విష్ణు స్వరూప్ శుక్రవారం గుండె నొప్పితో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య ఆదివారం పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ..అతి చిన్న వయసులో చాతి నొప్పితో విష్ణు స్వరూప్ మృతి చెందడం చాలా బాధాకర మన్నారు.