ATP: పోలీస్ స్టేషన్లోనే లాయర్ కుప్పకూలి శనివారం రాత్రి మృతి చెందాడు. ఆస్తి వివాదంపై లాయర్ శేషాద్రిని పోలీసులు స్టేషన్కు పిలిచి విచారించారు. సీఐ శాంతిలాల్ ఛాంబర్లో మాట్లాడుతుండగా కుప్పకూలి మృతిచెందినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. విచారణకు పిలిచి కానిస్టేబుళ్లు, సీఐ కఠినంగా వ్యవహరించారని, తీవ్ర ఒత్తిడికిలోనై శేషాద్రి మరణించినట్లు తెలుస్తోంది.
ASR: బొర్రా గుహలకు సందర్శకుల తాకిడి పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో రావడంతో ఈ పరిసరాలు కిటకిటలాడాయి. శనివారం సుమారు 8 వేల మంది ఈ ప్రాంతాన్ని సందర్శించగా..రూ.7.50 లక్షల ఆదాయం సమకూరిందని మేనేజర్ తెలిపారు. శనివారం ప్రముఖ దర్శకుడు రాజమౌళి బొర్రా గుహలను సందర్శించారు. షూటింగ్ లొకేషన్లు చూడడానికి ఇక్కడికి వచ్చినట్టు సమాచారం.
కడప: గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ MLC రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ అంతక్రియలు కడపలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి కడప కో ఆపరెటీవ్ కాలనీ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. అనంతరం శివారులోని చలమారెడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేయనున్నట్లు తెలిపారు.
SKLM: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కేంద్రం ప్రారంభించిన ఆస్పిరేషనల్ బ్లాక్స్లో దక్షిణ భారతదేశంలోనే భామిని మండలం అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. నీతి ఆయోగ్ ప్రతి త్రైమాసికంలో ఈ సూచికల సాధనను విశ్లేషిస్తుంది. ఈ నేపథ్యంలోనే భామిని అగ్రస్థానంలో నిలవడంతో ప్రోత్సాహకంగా రూ.1.50 కోట్లు పొందినట్లు కలెక్టర్ తెలిపారు.
ATP: కుందుర్పి మండలంలోని నర్సంపల్లిలో శనివారం సాయంత్రం ఏకంగా శివలింగాన్ని దొంగతనం చేశారు. గ్రామస్థులు ఆలయంలో శివలింగం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏళ్లుగా పూజలు అందుకుంటున్న లింగం దొంగలు ఎత్తుకుపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
SKLM: జిల్లాలోని రైస్ మిల్లర్ల అభివృద్ధికి అన్ని విధాలుగా తన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా రైస్ మిల్లర్ సంఘ అధ్యక్షుడు బోయిన రమేష్.. రామ్మోమెహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు.
CTR: పుంగనూరు మున్సిపాలిటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.34,30,52,750 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశం హాల్లో బడ్జెట్ సమావేశం జరిగింది. ప్రవేశపెట్టిన బడ్జెట్ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
SKLM: నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన యువతకు పెయింటింగ్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, ఏసీ మరమ్మతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జనవరి 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
TPT: గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బనిగీసాహెబ్ పేటలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 20బైకులను పోలీసులు సీజ్ చేశారు. ఒకటో పట్టణ సీఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని బైకులను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో తరలించారు.
KRNL: గాజులదిన్నె ప్రాజెక్టులో కేవలం 2 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుస్తోందని కోడుమూరు జడ్పీటీసీ రఘునాథ్ రెడ్డి అన్నారు. కర్నూలులో సంఘు స్థాయి సమావేశంలో ప్రస్తుతం హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి రోజుకు 200 క్యూసెక్కుల నీటిని జీడీపీకి వదులుతున్నామనే ఇరిగేషన్ అధికారుల సమాధానంతో అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే వేసవిలో కోడుమూరుకు తాగునీటి కష్టాలు తప్పవని అన్నారు.
E.G: జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో రాజానగరంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన ఉద్యోగమేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరిచంద్రప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పెరుమాళరావు శనివారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో మూడు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. వివరాలకు నెంబర్9988853335 ద్వారా సంప్రదించాలన్నారు.
ASR: చింతపల్లి మండలం ఎర్రవరం జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఆదివారం వీకెండ్ కావడంతో తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. జల జల జారువారుతున్న జలపాతంలో స్నానాలు ఆచరించి సందడి చేస్తున్నారు. అయితే జలపాతం వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
ప్రకాశం: జనవరి 1వ తేదీ నుంచి సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం సదరం ప్రక్రియను నిలిపేశారని పేర్కొన్నారు.
VSP: ప్రతి ఏటా నిర్వహించే వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పాల్గొన్నారు. శనివారం విశాఖలోని గ్రేహౌండ్స్లో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్లో ఎస్సై స్థాయి నుంచి పైస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా రెండు విడతలుగా ఫైరింగ్లో శిక్షణ ఇస్తామన్నారు.
SKLM: అన్నమయ్య జిల్లా గాలివీడులో ఎంపీడీవో జవహర్బాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కోటబొమ్మాళి, జలుమూరు మండలాల్లో ఎంపీడీవోలు ఫణీంద్రకుమార్, కె.అప్పలనాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.