• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ASR: ముంచంగిపుట్టు మండలంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిస్సా రాష్ట్రంలోని జొడహం పంచాయతీ పరిధి కొట్ని పొదురుకి చెందిన జలంధర్ ముంచంగిపుట్టు వైపు నుంచి తమ స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని దూళిపుట్ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో జలంధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

December 29, 2024 / 10:32 AM IST

గొలుసు దొంగ అరెస్ట్

పల్నాడు: ఈపూరు మండలంలో ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన యువకుడిని ఎస్సై ఉమామహేశ్వరరావు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈపూరుకు చెందిన గుంటకుల పేరమ్మ తన ఇంట్లో టీవీ రావడం లేదని కేబుల్ ఆపరేటర్ సాయిరాంకు తెలిపింది. డిసెంబర్ 24న కేబుల్ వైర్లు బాగుచేసినట్లు చేసి మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లాడు.

December 29, 2024 / 10:24 AM IST

జాతర ముగిసింది.. పట్నం పిలిచింది

KRNL: జాతర ముగియడంతో పాఠశాల విద్యార్థులతోపాటు కుటుంబ సమేతంగా వలస బాట పట్టారు. ఆదోని మండలం పాండవగల్లు గ్రామానికి చెందిన కూలీలు గత వారం రోజుల కిందట గ్రామంలో ఆంజనేయ స్వామి జాతరకు వచ్చారు. పండగ పూర్తి కావడం, ఊళ్లో పనులు లేకపోవడంతో పిల్లాపాపలతో కర్ణాటక రాష్ట్రంలోని వాడి ప్రాంతానికి పత్తి పనులకు వెళ్తూ మంత్రాలయం మీదుగా వెళ్తున్నారు.

December 29, 2024 / 10:19 AM IST

‘PGRSను సద్వినియోగం చేసుకోండి’

KRNL: జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియం నందు ఈ నెల 30న నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఆయా వినతులను వేగవంతంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.

December 29, 2024 / 10:18 AM IST

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

GNTR: పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని భాస్కర్ నగర వద్ద నివాసం ఉంటున్న ఓ మహిళా ఆదివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పెదకాకాని పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు షేక్ మల్లికగా పోలీసులు గుర్తించారు. మల్లిక శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

December 29, 2024 / 10:16 AM IST

బెల్లపు ఊటధ్వంసం…. కేసు నమోదు

KRNL: నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి సారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లపు ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ కిషోర్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని నాగలూటి గూడెం అడవి ప్రాంతంలో దాడులు శనివారం నిర్వహించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి తయారీకి సిద్ధంగా ఉన్న 2700 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు.

December 29, 2024 / 10:13 AM IST

మిట్టపాలెం నారాయణస్వామికి ప్రత్యేక పూజలు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలోని నారాయణస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చి, స్వామివారికి పొంగలి నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

December 29, 2024 / 10:08 AM IST

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

కృష్ణా: కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గుంటూరు, గయ (బీహార్) మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం 07719 గుంటూరు-గయ రైలును జనవరి 25న, నం. 07720 గయ-గుంటూరు రైలును జనవరి 27న నడుపుతున్నామని తెలిపింది. నం. 07719 రైలు 25న మధ్యాహ్నం 3.30కి విజయవాడ చేరుకుంటుందని తెలిపారు.

December 29, 2024 / 10:03 AM IST

సోమశిల ప్రాజెక్టు తాజా పరిస్థితి

NLR: సోమశిల జలాశయానికి ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి 4,108 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నట్లు జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దశరధ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 71.828 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 1500 క్యూసెక్కులు, కండలేరుకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

December 29, 2024 / 10:01 AM IST

ఆటో నుంచి జారిపడి మహిళా కూలీకి గాయాలు

ATP: గుత్తి పట్టణ శివారులో ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారిపడి లక్ష్మీదేవి అనే మహిళ కూలికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంతకల్లు నుంచి గుత్తికి ఆటోలో సామాన్లు తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.

December 29, 2024 / 10:01 AM IST

పొగ మంచుతో అవస్థలు పడుతున్న వాహనదారులు

NLR: వరికుంటపాడు మండలంలో ఆదివారం తెల్లవారుజామునుంచే దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో ఎక్కడ ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం సమయంలోనూ వాహనదారులు లైట్లు వేసి వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

December 29, 2024 / 10:00 AM IST

బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులు అరెస్ట్

కృష్ణా: మచిలీపట్నంలో శుక్రవారం రాత్రి బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కాళ్లు, చేతులు కట్టి గంజాయి మత్తులో గ్యాంగ్ రేప్ చేశారనేది అబద్ధం అన్నారు.

December 29, 2024 / 09:55 AM IST

బోయకొండలో పెరిగిన భక్తుల రద్దీ

CTR: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తలు రద్దీ పెరిగింది. ఉదయం 5 గంటల నుంచి రద్దీ కొనసాగుతున్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. సుమారు 15,000 మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలను అందించేలా చర్యలు చేపట్టారు.

December 29, 2024 / 09:53 AM IST

విద్యార్థులకు అలర్ట్.. వాయిదా పడ్డ పరీక్షలు

కృష్ణా: యూనివర్సిటీ పరిధిలో 2025 జనవరి 3న జరగనున్న 2 పరీక్షలు వాయిదాపడ్డాయి. వచ్చే నెల 3న మచిలీపట్నంలో యువ కెరటాలు కార్య క్రమం నిర్వహించనున్న నేపథ్యంలో UG 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు జనవరి 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. PG, MBA & MCA 1వ & 3వ సెమిస్టర్ పరీక్షలను జనవరి 20న నిర్వహిస్తామని KRU ఓ ప్రకటన విడుదల చేసింది.

December 29, 2024 / 09:53 AM IST

రాళ్ళపాడు రిజర్వాయర్ తాజా పరిస్థితి

ప్రకాశం: రాళ్ళపాడు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండడంతో ముందు జాగ్రత్త చర్యగా శనివారం రాత్రి 10:30 గంటలకు 750 క్యూసెక్కుల నీటిని మన్నేరుకు వదిలినట్లు ప్రాజెక్ట్ డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో కూడా 750 క్యూసెక్కులు ఉందన్నారు. ఇన్ ఫ్లో పరిస్థితిని బట్టి మన్నేరుకు నీటిని విడుదల చేయడం గురించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

December 29, 2024 / 09:52 AM IST