• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈ నెల 23 నుంచి శ్రీకాళహస్తీశ్వర పరివార దేవతల ప్రతిష్ఠ మహోత్సవాలు

TPT: చిట్టమూరు మండలం ఉప్పలమర్తి గ్రామంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పరివార దేవతల నూతన విగ్రహ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక మహోత్సవాలు ఈనెల 23 నుంచి 25 వరకు వైభవంగా జరగనున్నాయి. 23న గ్రామోత్సవం, 24న విశేష పూజలు నిర్వహిస్తారు. 25న మహా కుంభాభిషేకం, అనంతరం శాంతి కళ్యాణం, అన్నదానం జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

February 20, 2026 / 11:33 AM IST

అమర వీరుని జ్ఞాపకంగా ఆలయ నిర్మాణం చేస్తున్న గ్రామస్తులు

PPM: గరుగుబిల్లి మండలానికి చెందిన BSF జవాను జయప్రకాశ్ నారాయణ జ్ఞాపకార్థం స్దానిక సీతారామపురంలో గ్రామస్థులు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. IND-BNG సరిహద్దుల్లో దేశ రక్షణ విధుల్లో 2009లో వీరమరణం పొందారని జవానుకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

February 20, 2026 / 11:31 AM IST

‘ప్రజలు విధులు బాధ్యతలు తెలుసుకోవాలి’

VZM: ప్రజలు తమ యొక్క విధులు బాధ్యతలను తప్పనిసరిగా తెలుసుకోవాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం బోడసింగిపేట గ్రామంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 11:30 AM IST

పేద ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ

CTR: రంజాన్ మాసం ప్రారంభం మైన సందర్భంగా పుంగునూరు పట్టణంలో పేద ముస్లింలకు MM మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకులను శుక్రవారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ అందరు సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని 20 సంవత్సరాల నుంచి చేపడుతున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 11:27 AM IST

ప్రబుత్వ పాఠశాలలో ప్రవేశాల కోసం ప్రత్యేక చర్యలు

VZM: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో గుర్ల మండలం పెద్దబంటుపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం టీచర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

February 20, 2026 / 11:23 AM IST

లారీ ఢీకొని యువకుడి మృతి

KDP: ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డులోని సినీ హబ్ మలుపు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జీవరత్నం అనే యువకుడు మృతి చెందాడు. ఖాజీపేట మండలం ఏటూరు గ్రామానికి చెందిన జీవరత్నం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.

February 20, 2026 / 11:23 AM IST

చేనేత స్టాళ్లను సందర్శించిన మంత్రి సవిత

సత్యసాయి: అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత శుక్రవారం సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించి, అందుబాటులో ఉన్న వస్త్రాల స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను సమృద్ధిగా నిల్వ ఉంచాలని మంత్రి ఆదేశించారు.

February 20, 2026 / 11:22 AM IST

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు

KDP: సిద్దవటం మండలం మాధవరం-1పరిధిలోని బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

February 20, 2026 / 11:20 AM IST

తాడిపత్రి మున్సిపాలిటీకి సొంత సోలార్ ప్లాంట్

ATP: తెలుగు రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తాడిపత్రి వేదిక కాబోతోంది. తాడిపత్రి మున్సిపాలిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేయనున్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడం ద్వారా మున్సిపాలిటీకి నెలకు సుమారు రూ.22 లక్షల విద్యుత్ బిల్లు ఆదా కానుంది.

February 20, 2026 / 11:19 AM IST

గుర్తింపు కార్డు ఉంటేనే ఏయూలోకి అనుమతి..!

VSP: గత కొన్ని రోజులగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. గుర్తింపు కార్డు కలిగిన వారిని మాత్రమే విశ్వవిద్యాలయంలోకి అనుమతిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఎస్ఐ మధ్య వివాదం, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ చేసిన నిరాహార దీక్షలు నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

February 20, 2026 / 11:18 AM IST

అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్ల పరిశీలన

GNTR: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను మంత్రి సవిత సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులను సమృద్ధిగా నిల్వ ఉంచాలని అధికారులకు ఆదేశించారు.

February 20, 2026 / 11:15 AM IST

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన

SKLM: రణస్థలం పంచాయతీ పరిధిలోని గొర్లె వీధిలో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రణస్థలం పంచాయతీ సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

February 20, 2026 / 11:13 AM IST

అసెంబ్లీలో సిమెంట్ ఫ్యాక్టరీల భూములపై గళమెత్తిన యరపతినేని

PLD: సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం పేరుతో రైతుల వద్ద తక్కువ ధరకే భూములు కొన్న యాజమాన్యాలు, ఇప్పటికీ పనులు చేపట్టకపోవడంపై గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో శుక్రవారం ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీలు వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రైతులు ఆశపడ్డారని, కానీ నేడు అటు పొలం లేక, ఇటు పరిశ్రమలు రాక రైతులు కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

February 20, 2026 / 11:13 AM IST

ఎమ్మెల్యే భానుప్రకాష్ చొరవతో ఆ రోడ్డుకి మహర్దశ

CTR: విజయపురం మండలంలో గత కొన్నేళ్లుగా గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డుకు ఎమ్మెల్యే భానుప్రకాష్ చొరవతో మహర్దశ కలిగింది. విజయపురం మండలంలో ముత్యాలరెడ్డి కండ్రిగ, మంగళం మీదుగా విజయపురం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని పట్ల మండల కూటమి నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 20, 2026 / 11:05 AM IST

‘అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించండి’

AKP: నర్సీపట్నంలో అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేతల నాగేశ్వరరావు కోరారు. దళితులకు శుభకార్యాలు, సమావేశాల కోసం ప్రత్యేక స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించి భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

February 20, 2026 / 10:55 AM IST