కడప: పెండ్లిమర్రి మండలంలోని పాపాఘ్ని పరివాహక ప్రాంతంలోని నందిమండలం, కొత్తగంగిరెడ్డిపల్లె ఇసుక రీచ్లను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా రీచ్లలో ఇసుక బుకింగ్ నమోదు ఎలా చేస్తున్నారనే వివరాలను స్టాఫ్ను అడిగి తెలుసుకున్నారు. రీచ్ నిర్వహణ కార్యకలాపాలపై సంబందిత రీచ్ నిర్వాహకులు, మహిళా పోలీసులతో మాట్లాడారు.
VZM: ఇటీవల చీపురుపల్లి వైసీపీ మండలాద్యక్షుడు ఇప్పిలి అనంతం తండ్రి సత్యం మృతి చెందిన నేపథ్యంలో శనివారం మాజీ MP బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల మాజీ MLA బడ్డుకొండ అప్పలనాయుడు చీపురుపల్లిలో ఆయన స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు.
పల్నాడు: రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసరావుపేట మండలం యల్లమంద గ్రామ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు నిర్వహణ నిమిత్తం డిసెంబర్ 30, 2024న సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయబడింది. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరు కావాలనుకున్న ఫిర్యాదుదారులు గమనించవలసిందిగా కోరారు.
E.G: షెడ్యూల్డ్ కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం డిసెంబర్ 26న సర్వే ప్రారంభమైందని, ఈ జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి ఈ నెల 31వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని కలెక్టర్ ప్రశాంతి శనివారం తెలిపారు. ఫిర్యాదులను VROలు సేకరించి పోర్టల్లో డిజిటలైజ్ చేస్తారని, తుది సమీక్ష పూర్తి చేసి 2025 జనవరి 1న తుది జాబితా ప్రచురిస్తామన్నారు.
కడప: గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు జిల్లా స్థాయి పరుగుపందెం (దూరపు పోటీ) పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాషా తెలిపారు. ఆదివారం ఉదయం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో పోటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు.
KDP: జిల్లాలోని కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల ప్రాంగణంలో ఎంపికలు ఉంటాయని చెప్పారు. క్రీడాకారులు తమ వెంట పదో తరగతి మార్క్స్ లిస్టు, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.
ELR: కైకలూరు మండలం లింగాల గ్రామంలో శనివారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నూతన బస్సు షెల్టర్, సీసీ రోడ్లను ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తుందని పేర్కొన్నారు.
పల్నాడు: మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 25వ తేదీ రాత్రి ఓ కానిస్టేబుల్, హోంగార్డు ఇద్దరూ ఘర్షణ పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా SP కంచి శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. గొడవ మద్యం మత్తులో జరగలేదని అన్నారు. వాళ్ల వ్యక్తిగత విషయంలో జరిగిందని.. తమ దృష్టికి రావడంతో హోంగార్డును సస్పెండ్ చేయడంతో పాటు కానిస్టేబుల్పై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. గతంలో అరవిందో కంపెనీ వద్ద రూ.5 కోట్లు అడిగావా లేదా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పొదలకూరు లేఔట్లు, ఇరిగేషన్ శాఖలో విజిలెన్స్ విచారణ విషయంలో కోట్ల రూపాయలు అడగలేదా? అంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయాలు నిజం కాదని కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? అని అడిగి 18 రోజులు గడిచాయన్నారు.
సత్యసాయి: రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
కడప: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా టీపీ వెంకట సుబ్బమ్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం కడప నగర మేయర్ కె. సురేశ్ బాబను ఆయన క్యాంపు కార్యాలయంలో ఆమె మర్యాదపూర్వకంగా కలుసుకొని ధన్యవాదాలు తెలిపారు. ఆమెతో పాటు టీపీ దుర్గా ప్రసాద్, మాజీ సోషల్ మీడియా అధ్యక్షురాలు సునీత రెడ్డి ఉన్నారు.
W.G: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన 16వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉన్న 47 పరిశ్రమలకు స్టాటిటరీ నోటీసులు ఇచ్చి, వాటికి సంబంధించిన రిపోర్టులను అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పల్నాడు: జగన్ అసమర్ధత పాలన వల్లే నేడు విద్యుత్ చార్జీలు పెరిగాయని తానే విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ధర్నాలు చేయటం శోచనీయంగా ఉందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమలు కానీ హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మండిపడ్డారు.
ATP: ఉరవకొండ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి అనంతపురం నగరంలోని రామ్ నగర్లో ఉన్న మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉరవకొండ నియోజకవర్గంలో రహదారుల పరిస్థితిపై ఆర్అండ్బీ అధికారులతో మంత్రి పయ్యావుల సమీక్ష నిర్వహించారు.
NLR: దుత్తలూరులోని సీడ్స్ సంస్థలో ఆదివారం జిల్లా స్థాయి క్విజ్ పోటీలు జరుగుతాయని ఆ సంస్థ ప్రతినిధి చేజర్ల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లో మండలస్థాయి పోటీలు నిర్వహించామన్నారు. ఫైనల్ పోటీల్లో విజేతలైన వారికి నగదు బహుమతులు, షీల్డ్ అందజేస్తామని వెల్లడించారు.