ATP: బీటీపీ ఆయకట్టు పరిధి రైతులు, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట మండలం రైతులు, బీటీపీ సాగునీటి సంఘం సభ్యులు, కూటమి నేతలు, ప్రజలతో శనివారం భైరవనితిప్ప ప్రాజెక్ట్ ఆయకట్టు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు హాజరయ్యారు.
ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో భూమిక అనే మహిళ ప్రయాణికురాలి జత బంగారు కమ్మలు, రూ.9వేల నగదును దొంగలు అపవారించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.పెద్దవడుగూరు మండలం మిడుతూరుకు చెందిన భూమిక గుంతకల్కు వెళ్తుండగా గుత్తి బస్టాండ్లో బ్యాగులో ఉన్న ఆ సామాగ్రిని అపవారించారు. ఈ సంఘటనపై ఎస్సై సురేష్ బస్టాండ్కి వెళ్లి విచారణ చేపట్టారు.
SKLM: ఈ నెల 29వ తేదీన ఎచ్చెర్ల మండల కేంద్రంలోని ఎన్హెచ్ -16 రోడ్డుకు అనుకుని ఉన్న ప్రాంతంలో తూర్పుకాపు మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ ప్రతినిధి యర్లంకి మౌలీశ్వరరావు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి కులస్తుందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు.
GNTR: రేపు కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా, వన్ మ్యాన్ కమీషన్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, షెడ్యూల్డ్ కుల సంఘాలతో ప్రతినిధుల నుంచి ఉదయం 10 గంటల నుంచి అభిప్రాయాలు స్వీకరించే కార్యక్రమం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు చేశామని అన్నారు.
ELR: కొల్లేరుపై 2022-23లో నిర్వహించిన లిడార్ సర్వే పూర్తవడంతో దానిపై శనివారం శాఖల అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి సమీక్ష నిర్వహించారు. గ్రౌండ్ ట్రూ థింగ్ కోసం అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై చర్చించారు. శాస్త్రీయబద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, లిడార్ సర్వే ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
కడప: పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల్ల గ్రామంలో నివాసం ఉంటున్న పిల్లి కావ్య అనే వివాహిత అదృశ్యం అయినట్లు భర్త మల్లికార్జున పోరుమామిళ్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు. కావ్య గత 4 రోజుల క్రితం పోరుమామిళ్లకు తన ఇంటి నుంచి ఆటోలో వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని, తన బంధువులను విచారించి ఆచూకీ తెలియకపోవడంతో ఫిర్యాదు చేశానన్నారు.
ELR: టి.నర్సాపురం మండలం వెలగపాడు శివారులో శనివారం రాత్రి దారుణం జరిగింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో భార్య శ్రావణి (23)ను భర్త రాము హత్య చేశాడు. తలపై కర్రతో దాడి చేయడంతో ఆమె ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని డీఎస్పీ రవిచంద్ర, ఎస్ఐ చెన్నారావు దర్యాప్తు చేస్తున్నారు.
GNTR: ఆటో డ్రైవర్ల ముసుగులో కొంతమంది అసాంఘిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ కళ్యాణ మండపంలో శనివారం ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా డ్రైవర్లు వ్యవహరించాలని కోరారు.
KKD: విద్యుత్ ఛార్జీలు పెంపునకు జగన్మోహన్ రెడ్డే కారణమని TDP రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు విమర్శించారు. శనివారం సాయంత్రం పెద్దాపురంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన వైఎస్ జగన్ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ELR: మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో శనివారం ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పాల్గొన్నారు. ప్రజల వద్ద వినతులు స్వీకరించి వాటిని నమోదు చేసుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
కోనసీమ: మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పర్యటన వివరాలను మంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం కాజులూరులో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పార్టీ ఆఫీస్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 5 గంటలకు కాకినాడ రూరల్ వాకాడ గ్రీన్ ఫీల్డ్ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొంటారు. రాత్రికి విజయవాడ బయలుదేరి వెళ్తారని పేర్కొంది.
PLD: క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో నేడు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళా రావిపాటి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. 35 పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 2వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయని తెలిపారు.
కడప: ఆదర్శ స్కూల్ పిల్లలను ఇంటికి తరలిస్తున్న ఆటో పరసతోపు వద్ద బోల్తా పడి 8మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గుండ్లపల్లికి చెందిన విద్యార్థులు ఆదర్శ స్కూల్లో చదువుతున్నారు. సాయంత్రం స్కూల్ వదలగానే ఆటోలో ఇంటికి వెళుతుండగా, పరసతోపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడ్డవారిని మదనపల్లెకి తరలించారు.
GNTR: కుల గణన సర్వేలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 31లోగా ఫిర్యాదు చేయాలని కాకుమాను తహశీల్దార్ వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి జనవరి 6 వరకు అభ్యంతరాలపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ఎస్సి కులగణన తుది జాబితాను జనవరి 10న ఆయా గ్రామ, వార్డు సచివాలయంలో ప్రకటిస్తారని వివరించారు.
సత్యసాయి: అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు తరచూ పోలీసులు గ్రామాలను సందర్శిస్తూ పల్లెనిద్రలు చేపట్టడమే కాక గ్రామాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ రత్న సూచించారు. ఎన్పికుంట, తనకల్లు పోలీస్ స్టేషన్లను శనివారం ఎస్పీ వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్ను, లాకప్ గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.