PLD: క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో నేడు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళా రావిపాటి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. 35 పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 2వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయని తెలిపారు.
కడప: ఆదర్శ స్కూల్ పిల్లలను ఇంటికి తరలిస్తున్న ఆటో పరసతోపు వద్ద బోల్తా పడి 8మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గుండ్లపల్లికి చెందిన విద్యార్థులు ఆదర్శ స్కూల్లో చదువుతున్నారు. సాయంత్రం స్కూల్ వదలగానే ఆటోలో ఇంటికి వెళుతుండగా, పరసతోపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడ్డవారిని మదనపల్లెకి తరలించారు.
GNTR: కుల గణన సర్వేలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 31లోగా ఫిర్యాదు చేయాలని కాకుమాను తహశీల్దార్ వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి జనవరి 6 వరకు అభ్యంతరాలపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ఎస్సి కులగణన తుది జాబితాను జనవరి 10న ఆయా గ్రామ, వార్డు సచివాలయంలో ప్రకటిస్తారని వివరించారు.
సత్యసాయి: అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు తరచూ పోలీసులు గ్రామాలను సందర్శిస్తూ పల్లెనిద్రలు చేపట్టడమే కాక గ్రామాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ రత్న సూచించారు. ఎన్పికుంట, తనకల్లు పోలీస్ స్టేషన్లను శనివారం ఎస్పీ వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్ను, లాకప్ గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
కడప: పెండ్లిమర్రి మండలంలోని పాపాఘ్ని పరివాహక ప్రాంతంలోని నందిమండలం, కొత్తగంగిరెడ్డిపల్లె ఇసుక రీచ్లను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా రీచ్లలో ఇసుక బుకింగ్ నమోదు ఎలా చేస్తున్నారనే వివరాలను స్టాఫ్ను అడిగి తెలుసుకున్నారు. రీచ్ నిర్వహణ కార్యకలాపాలపై సంబందిత రీచ్ నిర్వాహకులు, మహిళా పోలీసులతో మాట్లాడారు.
VZM: ఇటీవల చీపురుపల్లి వైసీపీ మండలాద్యక్షుడు ఇప్పిలి అనంతం తండ్రి సత్యం మృతి చెందిన నేపథ్యంలో శనివారం మాజీ MP బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల మాజీ MLA బడ్డుకొండ అప్పలనాయుడు చీపురుపల్లిలో ఆయన స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు.
పల్నాడు: రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసరావుపేట మండలం యల్లమంద గ్రామ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు నిర్వహణ నిమిత్తం డిసెంబర్ 30, 2024న సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయబడింది. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరు కావాలనుకున్న ఫిర్యాదుదారులు గమనించవలసిందిగా కోరారు.
E.G: షెడ్యూల్డ్ కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం డిసెంబర్ 26న సర్వే ప్రారంభమైందని, ఈ జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి ఈ నెల 31వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని కలెక్టర్ ప్రశాంతి శనివారం తెలిపారు. ఫిర్యాదులను VROలు సేకరించి పోర్టల్లో డిజిటలైజ్ చేస్తారని, తుది సమీక్ష పూర్తి చేసి 2025 జనవరి 1న తుది జాబితా ప్రచురిస్తామన్నారు.
కడప: గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు జిల్లా స్థాయి పరుగుపందెం (దూరపు పోటీ) పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాషా తెలిపారు. ఆదివారం ఉదయం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో పోటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు.
KDP: జిల్లాలోని కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల ప్రాంగణంలో ఎంపికలు ఉంటాయని చెప్పారు. క్రీడాకారులు తమ వెంట పదో తరగతి మార్క్స్ లిస్టు, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.
ELR: కైకలూరు మండలం లింగాల గ్రామంలో శనివారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నూతన బస్సు షెల్టర్, సీసీ రోడ్లను ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తుందని పేర్కొన్నారు.
పల్నాడు: మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 25వ తేదీ రాత్రి ఓ కానిస్టేబుల్, హోంగార్డు ఇద్దరూ ఘర్షణ పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా SP కంచి శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. గొడవ మద్యం మత్తులో జరగలేదని అన్నారు. వాళ్ల వ్యక్తిగత విషయంలో జరిగిందని.. తమ దృష్టికి రావడంతో హోంగార్డును సస్పెండ్ చేయడంతో పాటు కానిస్టేబుల్పై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. గతంలో అరవిందో కంపెనీ వద్ద రూ.5 కోట్లు అడిగావా లేదా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పొదలకూరు లేఔట్లు, ఇరిగేషన్ శాఖలో విజిలెన్స్ విచారణ విషయంలో కోట్ల రూపాయలు అడగలేదా? అంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయాలు నిజం కాదని కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? అని అడిగి 18 రోజులు గడిచాయన్నారు.
సత్యసాయి: రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
కడప: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా టీపీ వెంకట సుబ్బమ్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం కడప నగర మేయర్ కె. సురేశ్ బాబను ఆయన క్యాంపు కార్యాలయంలో ఆమె మర్యాదపూర్వకంగా కలుసుకొని ధన్యవాదాలు తెలిపారు. ఆమెతో పాటు టీపీ దుర్గా ప్రసాద్, మాజీ సోషల్ మీడియా అధ్యక్షురాలు సునీత రెడ్డి ఉన్నారు.