• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి జనసేనలోకి పలువురు చేరిక

VZM: డెంకాడ మండలం పేడాడ గ్రామంలో వైసీపీ నుంచి జనసేనలోకి పలువురు చేరారు. భోగాపురం మండలం ముంజేరులోని జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి జనసేన కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు ఆధ్వర్యంలో ఆదివారం పేడాడకు చెందిన వైస్ సర్పంచి పట్నాల రవి, వార్డుమెంబర్లు పట్నాల గురమ్మ, పిట్ట పద్మ, మిరప అప్పన్న జనసేనలో చేరారు.

December 29, 2024 / 08:01 PM IST

‘వాల్మీకులు పోరాటానికి సిద్ధం కావాలి’

KRNL: ST సాధన కోసం ప్రతి ఒక వాల్మీకి సోదరుడు సిద్ధం కావాలని ఏపీ బోయ వాల్మీకి సమితి రాష్ట్ర అధ్యక్షుడు మారెళ్ళ అంజి వాల్మీకి పిలుపునిచ్చారు. తుగ్గలి మండల పరిధిలోని మారేళ్ల గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు బోయ వాల్మీకి ST అనే నినాదం మార్మోగాలని వాల్మీకిలకు మారెళ్ళ అంజి పిలుపునిచ్చారు.

December 29, 2024 / 08:01 PM IST

నియోజకవర్గం అభివృద్ధికి పాత్రికేయులు సహకరించాలి: ఎమ్మెల్యే

KKD: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసే ఏకైక వ్యవస్థ పాత్రికేయ రంగమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఆదివారం ప్రత్తిపాడులో టీడీపీ వద్ద నిర్వహించిన పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధికి పాత్రికేయులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకులు పాల్గొన్నారు.

December 29, 2024 / 08:01 PM IST

‘237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహణ’

W.G: జిల్లాలో ఇప్పటివరకు 237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ సదస్సుల నిర్వహణ ద్వారా ప్రజల నుంచి భూ సంబంధ, రెవెన్యూ శాఖల పరంగా మ్యుటేషన్, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

December 29, 2024 / 08:01 PM IST

‘ఆదిత్యుని నేటి ఆదాయం’

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ఒక్క రోజు వచ్చిన ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.59,200, పూజలు, విరాళాల రూపంలో రూ.99,852, ప్రసాదాల రూపంలో రూ.1,43,875 స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

December 29, 2024 / 07:58 PM IST

కామాక్షమ్మ సన్నిధిలో జిల్లా రెవెన్యూ అధికారి

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్లను ఆదివారం జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అర్చకులు అతిధులను శేష వస్త్రములతో సత్కరించి వేద ఆశీర్వచనం అందజేశారు.

December 29, 2024 / 07:58 PM IST

నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు

CTR: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హద్దులు మీరితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెంకటగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏవి రమణ హెచ్చరించారు. ఆదివారం మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి విపరీతమైన శబ్దాలతో డీజేలు, బైకుల సౌండ్లు నిర్వహిస్తే వారిపై అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.

December 29, 2024 / 07:57 PM IST

గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ప్రకాశం: బల్లికురవ మండలంలోని ఈర్లకొండ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని వెంకటేష్ అనే యువకుడు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి వివేకానంద రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా ఎస్సై జీవి చౌదరి తెలిపారు.

December 29, 2024 / 07:47 PM IST

మాజీ డిప్యూటీ సీఎంని కలిసిన మహిళా అధ్యక్షురాలు

KDP: మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్ఆర్ కడప జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా తెలుగుపులి వెంకట సుబ్బమ్మ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను ఆయన క్యాంపు కార్యాలయంలో సుబ్బమ్మ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. దుర్గా ప్రసాద్, సోషల్ మీడియా కో కన్వీనర్ సునీత రెడ్డి, పాల్గొన్నారు.

December 29, 2024 / 07:44 PM IST

నత్తనడకన అభివృద్ధి పనులు

PPM: పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా మక్కువ మండల వ్యాప్తంగా మంజూరైన అభివృద్ధి పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. సుమారు రూ.633 కోట్ల ఉపాధి హామీ నిధులతో 21 పంచాయతీల్లోని సుమారు 102 పనులు మంజూరు అయ్యాయి. వీటిలో కేవలం 33 పనులే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

December 29, 2024 / 07:43 PM IST

పోలీసు కానిస్టేబుల్ దేహధారుఢ్య పరీక్షలకు సర్వం సిద్ధం

SKLM: ఎచ్చెర్ల జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసు మైదానాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఎచ్చెర్ల పరేడ్ గ్రౌండ్‌లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించి ఆదివారం ఉదయం ట్రైల్ రన్ నిర్వహించారు. అభ్యర్థులకు ఛాతీ కొలత, ఎత్తు, ఫిజికల్ ఎఫిషియన్సీ, 1600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ సంబంధించి ట్రల్ రన్ దేహదారుఢ్య పరీక్షల సరళని ఎస్పీ పరిశీలించారు.

December 29, 2024 / 07:42 PM IST

బెజగం రవికుమార్‌కి భారత కళా రత్న పురస్కారం 

PLD: సత్తెనపల్లికి చెందిన పౌరాణిక కళాకారుడు బెజగం రవి కుమార్ ‘పుడమి సాహితీ వేదిక నల్గొండ వారిచే’ భరత కళారత్న జాతీయ గౌరవ పురస్కారం ప్రధానం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామం వేదికగా పుడమి సాహితీ వేదిక 6వ వార్షికోత్సవ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన సాహిత్యం పొందినవారు పాల్గొన్నారు.

December 29, 2024 / 07:42 PM IST

పమిడిముక్కలలో పర్యటించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలంలో ప్రైవేట్ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, పాల్గొన్నారు. అనంతరం వైసీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు వైసీపీ నాయకులు, కార్యకర్తలని ఆప్యాయంగా పలకరించారు. వైసీపీ అధికారంలో ఉంటే బాగుండేదని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారని, ఆ విషయాన్ని కార్యకర్తలు నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు.

December 29, 2024 / 07:42 PM IST

40వ రోజు కొనసాగిన దీక్షలు

PPM: గిరిజన గురుకుల ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు 40వ రోజు పార్వతీపురంలో ఆదివారం తమ నిరసన కొనసాగించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు దివాకర్, రమేశ్, రాజేశ్, రమణ, శ్రీను, తిరుపతి నాయుడు, రమణ, జ్యోతి పాల్గొన్నారు.

December 29, 2024 / 07:42 PM IST

గుర్తుతెలియని వృద్ధుడికి దహన సంస్కారాలు

అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో పోలీసులు ‘ఆ నలుగురు సేవా సమితి’ సభ్యులకు సమాచారం అందించారు. అనాధ శవానికి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ నలుగు సేవా సమితి సభ్యులు అంతక్రియలు నిర్వహించారు.

December 29, 2024 / 07:38 PM IST