ప్రకాశం: కంభంలోని పరీక్ష కేంద్రాలను ఎస్సై శివకృష్ణారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కోనసీమ: రామచంద్రపురంలోని అన్న క్యాంటీన్ను జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ సోమవారం తనిఖీ చేశారు. ఆహార పదార్థాలను స్వయంగా రుచిచూసి నాణ్యతను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. పేదలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శుచీశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను, నిర్వాహకులను ఆయన ఆదేశించారు.
VZM: దివంగత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ రణస్థలం మండలం జె. ఆర్. పురం సూర్య పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు లంక శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
ELR: సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా ఇవాళ ఏలూరు అశోక్ స్తంభం సెంటర్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ , జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అగ్రహారపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేశారు.
ELR: సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా ఇవాళ ఏలూరు అశోక్ స్తంభం సెంటర్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ , జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అగ్రహారపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేశారు.
BPT: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కృషి, పట్టుదలే విజయానికి మార్గమని పేర్కొన్నారు. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు విజయాలతో వెలిగిపోవాలని ఆకాంక్షించారు.
PLD: మాచర్ల – విజయవాడ ప్యాసింజర్ రైలు కింద పడి వీరిశెట్టి వైష్ణవి (29) అనే మహిళ మృతి చెందారు. సోమవారం గురజాల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
ATP: రాయదుర్గం పట్టణంలోని CDPO కార్యాలయం ఎదుట సోమవారం అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేపట్టి నిరసనలు తెలిపారు. CITU జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో అంగన్వాడీలు వేతనాలు పెంచాలంటూ నిరసనలు తెలిపారు. కనీస పనికి కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: పరిగి మండలంలోని వెలుగు కార్యాలయంలో 14 పంచాయతీల యానిమేటర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారునికి చేరేలా చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని యానిమేటర్లకు దిశానిర్దేశం చేశారు.
అన్నమయ్య: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భద్రత కట్టుదిట్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
E.G: స్వచ్ఛ భారత్కు అసలైన స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
PPM: కురుపాం మండలంలోని కొండలేవిడి ఆర్అండ్బీ రోడ్డు నుంచి కోనపాడు వరకు 2.8 కి.మీ రూ.3 కోట్లతో, గాంధీనగర్ ఆర్అండ్బీ రోడ్డు నుంచి దొంగల బారామని వరకు 2.6 కి.మీ. రూ.2.6 కోట్ల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. NREGS నిధులతో ఈ పనులు ప్రారంభించామని ఐటీడిఏ AEE అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అయినవిల్లి మండలంలోని అయినవిల్లి లంక గ్రామంలో లబ్ధిదారులకు సోమవారం అంబాజీపేట ఏఎంసీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షుడు వస్కా శ్యామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. డెక్క దుర్గా భవానికి రూ.62,163, జుత్తుక అరుణ కుమారికి రూ.42,142 నగదు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి నాగవాణి మాధవి లలిత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని ఆర్ఐవో వివరించారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని వినాయకనగర్లో డ్రైనేజీ కాలువ, వీధి విద్యుత్ లైన్, వీధి కొళాయి ఏర్పాటు చేయాలని సీపీఎం, భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. సోమవారం మండల ఎంపీడీవో వెంకటలక్ష్మికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో ప్రాథమిక సదుపాయాల లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పెద్దన్న వివరించారు.