• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దామెర్లకుంట-పెద్దచెరువు ప్రాంతాల పరిశీలన చేసిన ఈవో

KRNL: శ్రీశైలం క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి1 తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడనున్నాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దామెర్లకుంట పెద్దచెరువు ప్రాంతాలలో చేయాల్సిన ఆయా ఏర్పాట్లకు సంబంధించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు.

December 29, 2024 / 06:43 PM IST

‘ప్రశాంత వాతావరణంలో వేడుకలు చేసుకోవాలి’

CTR: న్యూఇయర్ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆంక్షలు విధించారు. డిసెంబరు31 రాత్రి జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్ట్‌లు, పికెట్‌లను ఏర్పాటు చేసి రాత్రి నుంచి వాహనాల తనిఖీ చేస్తామన్నారు. వారధి,యూనివర్సిటీ ఫ్లైఓవర్లను రాత్రి 10గంటలకు మూసివేయడం జరుగుతుందన్నారు. అశ్లీల నృత్యాలు, DJ వంటివి అనుమతులు లేవన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

December 29, 2024 / 06:36 PM IST

ప్రభుత్వ భూమిలో నాటిన కొబ్బరి మొక్కలు తొలగింపు

SKLM: సంతబొమ్మాలి మండలం జగన్నాధపురంలో సర్పంచ్ రాములమ్మ ఆధీనంలో ఉన్న భూమిలో కొబ్బరి మొక్కలను తహసీల్దార్ రమేష్ కుమార్ పోలీస్ సిబ్బందితో వెళ్లి ఆదివారం జెసిబితో తొలగించారు. తాను వైసీపీలో ఉండడం వల్లే రాజకీయ కక్షతో కొబ్బరి మొక్కలు తొలగించారని రాములమ్మ ఆరోపించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కావడంతో భూమిని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ తెలిపారు.

December 29, 2024 / 06:35 PM IST

మచ్చిలీపట్నంను క్రీడా హబ్గా మారుస్తా: మంత్రి కొల్లు

కృష్ణా: మచిలీపట్నంను క్రీడా హబ్గా మార్చేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక నేషనల్ కాలేజీ గ్రౌండ్స్‌లో సుబ్బారావు స్మారకంగా ఏర్పాటు చేసిన వెటరన్ క్రికెట్ టోర్నీ బహుమతి ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. అనంతరం క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చి వారందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

December 29, 2024 / 06:35 PM IST

‘ఎస్సీ కులగణన సర్వే తేదీ పొడిగించాలి’

W.G: మాదిగలను మాదిగ ఉప కులాలను మాలలుగా చిత్రీకరించి గత ప్రభుత్వ కుల గణన సర్వే ఆధారంగా కాకుండా 2011 సంవత్సరంలోని కులగణన సర్వే ప్రకారం వర్గీకరణ జరగాలని ఉత్తర కోస్తా జిల్లాల ఎమ్మార్పీఎస్ సమన్వయకర్త ముమ్మిడివరపు సుబ్బారావు అన్నారు. ఆదివారం కొవ్వూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. కులగణన సర్వే గడువు తేదీ పెంచాలని డిమాండ్ చేశారు.

December 29, 2024 / 06:32 PM IST

‘200 లీటర్ల బెల్లం ఊట ద్వంసం’

VZM: రామభద్రపురం మండలం జోగేంద్రవలసలో నాటు సారా తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఆదివారం ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించి 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ మేరకు ఎక్సైజ్‌ సీఐ పి.చిన్నంనాయుడు మాట్లాడుతూ.. నాటుసారా తయారు చేసిన, అమ్మిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా నివారణకు సహకరించాలని కోరారు.

December 29, 2024 / 06:28 PM IST

ధార్మిక కార్యక్రమాల కరపత్రాల ఆవిష్కరణ

కృష్ణా: అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో జనవరి 7,8,9,10 తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అవనిగడ్డ మండల ధర్మచార్యులు అన్నపరెడ్డి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని రామాలయం వద్ద ప్రత్యేక ధార్మిక కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు.

December 29, 2024 / 06:27 PM IST

కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్ ట్రయల్ రన్ 

KRNL: రేపటి నుంచి APSP గ్రౌండ్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించే దేహదారుడ్య పరీక్షల(ట్రయల్ రన్) రీహర్సల్‌ను ఎస్పీ జి.బిందు మాధవ్ పరిశీలించారు. PMT/PET పరీక్షలను పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కాగా, దేహదారుడ్య పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా RFID సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామన్నారు.

December 29, 2024 / 06:26 PM IST

కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణంపై విచారణ చేపట్టండి: పవన్

KKD: కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు చేపట్టాలని, పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

December 29, 2024 / 06:26 PM IST

రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆదివారం ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. అక్కడున్న స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్నా రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

December 29, 2024 / 06:24 PM IST

విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడికి మంత్రి అభినందన

VZM: జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన రామును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. సామాజిక కార్యక్రమాలను గుర్తించి తనకు ఈ అవకాశం కల్పించిన మంత్రి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దత్తిరాజేరు మండల టిడిపి నాయకులు రామానాయుడు, బంగారు నాయుడు పాల్గొన్నారు.

December 29, 2024 / 06:21 PM IST

రేపు వావింటపర్తికి రానున్న ఎమ్మెల్యే

NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం పొదలకూరు మండలం వావింటపర్తిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకుని రెవెన్యూ సదస్సులో పాల్గొంటారని టీడీపీ పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు ఆదివారం తెలిపారు. రైతులు, ప్రజలు తమ సమస్యలను రెవెన్యూ సదస్సు దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే కోరినట్లు పేర్కొన్నారు.

December 29, 2024 / 06:14 PM IST

31న ఉదయగిరికి రానున్న రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు

NLR: ఈ నెల 31న రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు బాజీ రానున్నట్లు ఉదయగిరి బీజేపీ నాయకుడు ముడమాల రమేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయగిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాలనను మెచ్చి నియోజకవర్గంలోని పలువురు పార్టీలోకి చేరనున్నట్లు తెలిపారు.

December 29, 2024 / 06:13 PM IST

31 రాత్రికి యువతకు డీఎస్పీ వార్నింగ్

NLR: నూతన సంవత్సర వేడుకల పేరిట ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ వివి రమణ కుమార్ హెచ్చరించారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 31న అర్ధరాత్రి నుంచి యువత బైక్ పై పెద్ద శబ్దాలు చేస్తూ తిరగడం నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయాలనుకుంటే అనుమతి తీసుకోవాలన్నారు.

December 29, 2024 / 06:13 PM IST

ఆడంబరాలకు దూరంగా నూతన సంవత్సర వేడుకలు

SKLM: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సేవా కార్యక్రమాలకే తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పూల బొకేలు, మిఠాయిలు, సత్కారాలు చేయవద్దని, ఆ ఖర్చుతో పేద విద్యార్థులకు సాయం చేయాలన్నారు.

December 29, 2024 / 06:10 PM IST