GNTR: పారిశ్రామికంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు సపోర్టుగా నిలుస్తాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. హనుమాన్ జంక్షన్లో జరిగిన ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ 7వ మాదిగ దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. యువత లక్ష్యాల సాధనలో సహనం, పట్టుదల, కృషి అవసరమని సూచించారు.
ELR: నేటి నుంచి జరగనున్న (PET&PMT) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా కీలక అంశాలను ఆయన వివరించారు. ‘సీసీ కెమెరాలు, డ్రోన్ ద్వారా పరీక్షలు నిర్వహణ వైద్య శిబిరం, అంబులెన్సులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు అభ్యర్థి ఒక్కరికి మాత్రమే మైదానంలోకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
బాపట్ల: పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం రాత్రి పురపాలక సంఘ ఎలక్ట్రికల్ వర్కర్స్తో మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి సమావేశమయ్యారు. పురపాలక సంఘ పరిధిలోని ప్రధాన డివైడర్లు, వార్డులలోని విద్యుత్ దీపాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సెంట్రల్ డివైడర్, వార్డులలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలని కమిషనర్ సూచించారు.
కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం ఉదయం 10 గంటలకు మంగళగిరి వెళతారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగే సమీక్షా సమావేశంలో వర్ల పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా, నియోజకవర్గ ప్రజలు ఏదైనా అత్యవసర సహాయం కోసం పామర్రులోని టీడీపీ కార్యాలయంలో సంప్రదించవచ్చని సూచించారు.
GNTR: ఈనెల 30న వన్ మాన్ కమిషన్ పర్యటన శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా ఐఏఎస్ (రిటైర్డ్) నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల వర్గీకరణపై నిర్దిష్ఠ సిఫారసులు సూచించడానికి జిల్లాలో పర్యటించనుంది. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల దృష్ట్యా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేశారు.
కడప: ఇటీవల ఖాజీపేట మండల కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్గా నియమితులైన కోనేటి హరి ఆదివారం రాత్రి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను కలిశారు. కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడానికి కారకులైన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ను సన్మానించడం జరిగిందని కోనేటి హరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి సోమవారం ఉదయం స్వగృహంలో ప్రజావినతులు స్వీకరిస్తారు. అనంతరం మద్యాహ్నం 1:30 గం.లకు మక్కువ మండలం శంబర గ్రామంలో శ్రీ శ్రీ పోలమాంబ జాతరను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మంత్రి కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో కోరాయి.
NLR: బుచ్చి మండలం దామరమడుగు గ్రామంలో ఆదివారం బీసీ సేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నిమ్మల నాగార్జున యాదవ్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేమిరెడ్డి దంపతుల మీద అభిమానంతో గ్రామంలో నిరుపేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిర్మల వెంకటేశ్వర్లు, వంశీ, లక్ష్మణరావు, సునీల్, అనూష తదితరులు పాల్గొన్నారు.
GNTR: సోషల్ మీడియాను మంచికి వాడుదాం అంటూ తాడేపల్లిలో భారీ హోర్డింగ్ వెలసింది. చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్ సోషల్ మీడియాపై క్యాంపెయిన్ త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగుల ఏర్పాటు చేశారు. పోస్ట్ నో ఈవిల్ పేరుతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
ప్రకాశం: గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులుగా అపిసెట్టి ఉదయ్ శంకర్ రెండోసారీ ఎన్నికయ్యారు. పదవి కోసం ఇద్దరు పోటీపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికను రిటర్నింగ్ అధికారి రెడ్డి మల్లా రెడ్డి పర్యవేక్షించారు. ఎన్నికలో ఉదయ్ శంకర్కు మెజార్టీ లభించడంతో మల్లారెడ్డి గెలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు ఉన్నారు.
KRNL: జిల్లాలో సోమవారం 5 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదోని రెవెన్యూ డివిజన్లోని జాలిమంచి, పాండవగల్లు, కర్నూలు రెవెన్యూ డివిజన్లో కర్నూల్ అర్బన్, కల్లూరు మండలంలోని రామదూర్, మొత్తము 05 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్నమయ్య: పీటీఎం మండలం కాట్నగల్లు సచివాలయంలో ఈనెల 31న మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రామూర్తి నాయక్ తెలిపారు. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుందన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. గ్రామంలోని ప్రజలు, రైతులు సదస్సుకు హాజరై తమ భూ, రెవెన్యూ, ఇతరత్రా సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.
ATP: రాప్తాడు నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ప్రతి తరగతికి అదనపు సీట్లు కేటాయించాలని ఎమ్మెల్యే పరిటాల సునీతకు విజ్ఞప్తి చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంజేపీ గురుకుల పాఠశాలల సెక్రటరీ కృష్ణ మోహన్ ఆదివారం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పేరూరు, నసనకోట ఎంజేపి బాల బాలికల పాఠశాల పరిశీలించారు.
W.G: మొగల్తూరు మండలానికి చెందిన ముత్యాలపల్లి గ్రామానికి చెందిన శ్రీబండి ముత్యాలమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్ కడలి మాణిక్యాలరావు, తన అనుచరులతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించారు.
కృష్ణా: కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరవ్వాల్సిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు సోమవారం నుంచి ఫిబ్రవరి 2 వరకు జరగనున్నాయి. మచిలీపట్నంలోని జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జరిగే ఈవెంట్లకు హాజరవ్వాల్సిన అభ్యర్థులకు ఆదివారం జిల్లా పోలీస్ అధికారులు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఈవెంట్లకు వచ్చే అభ్యర్థులు సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలను విడుదల చేశారు.