• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నరసాపురం నుంచి బనారస్‌కు ప్రత్యేక రైళ్లు

W.G: నరసాపురం నుంచి బనారస్ (వారణాసి) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ మధుబాబు ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నరసాపురం నుంచి రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, రాంచి, రాయగడ మీదగా జనవరి 26, ఫిబ్రవరి 2లో ఉదయం 6కు నెం.07109 రైలు బనారస్‌కు బయలుదేరుతుందన్నారు. జనవరి 27, ఫిబ్రవరి 3న బెనారస్ నుంచి నరసాపురానికి రైలు వస్తుందన్నారు.

December 30, 2024 / 04:10 AM IST

పాతపట్నంలో నేడు జాబ్ మేళా

SKLM: పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి యు సాయికుమార్ ప్రకటనలో తెలిపారు. AP రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా SSC , INTER, DEGREE పూర్తిచేసిన 18 – 35ఏళ్లు గల M/F లు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.

December 30, 2024 / 04:09 AM IST

కూచిపూడి నాట్యపతాక స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: కూచిపూడి నృత్యం ప్రత్యేక జెండా రూపొందించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 50 అడుగుల ఏకశిల ప్రతిష్ఠ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాల్లో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. అనంతరం కూచిపూడి నృత్యాలను ఆయన వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు.

December 30, 2024 / 04:09 AM IST

నెల్లూరులో WBM రోడ్డు పనులకు శంకుస్థాపన

నెల్లూరు రూరల్ పరిధిలోని 26వ డివిజన్ డ్రైవర్ కాలనీలో రూ.40 లక్షల నిధులతో WBM రోడ్డు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. 26వ డివిజన్లో ఆరు నెలల్లో రూ.1 కోటి 25 లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎప్పుడు ఏ చిన్న సమస్య కలిగిన తనకు ఒక ఫోన్ కాల్ చేస్తే స్పందిస్తానని పేర్కొన్నారు.

December 30, 2024 / 04:09 AM IST

గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్

కృష్ణా: మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు DSP అబ్దుల్ సుభాన్ తెలిపారు. 27వ తేదీ సాయంత్రం కాసానిగూడెం పావురాల గూడు సెంటర్ దగ్గర ఉన్న 13ఏళ్ల బాలికను మహ్మద్, బాల వెంకటసాయి అనే యువకులు బైక్‌పై తీసుకువెళ్లి పంపుల చెరువు వెనుక ప్రాంతానికి తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్టు తెలిపారు.

December 30, 2024 / 04:08 AM IST

RPWD యాక్టుతో వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలు

W.G: ఆర్ పీడబ్ల్యుడీ యాక్ట్- 2016 అమలు చేస్తే దివ్యాంగుల్లో మరి కొంతమందికి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని సక్షమ్ జిల్లా అధ్యక్షుడు కేఎస్ కేఎస్ అప్పారావు అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం సిపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో ఆర్పీడబ్ల్యుడి యాక్ట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యాక్టును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

December 30, 2024 / 04:07 AM IST

దళారుల మాటలు నమ్మి మోసపోకండి: ఎస్పీ

KRNL: పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అభ్యర్థులకు సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

December 30, 2024 / 04:06 AM IST

మనస్థాపానికి గురై వివాహిత ఆత్మహత్య

W.G: నిడదవోలు మండలం డి.ముప్పవరంలో ఆదివారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు సమిశ్రగూడెం ఎస్ఐ వీరబాబు తెలిపారు. భర్త త్రినాధ్ మద్యానికి బానిస కావడంతో భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన అతని భార్య కుమారి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

December 30, 2024 / 04:06 AM IST

‘తస్మాత్ జాగ్రత్త.. ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేస్తారు’

నెల్లూరు పోలీస్ గ్రౌండ్‌లో సోమవారం నుంచి నిర్వహించనున్న APSLRB పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతే ప్రమాణికంగా ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

December 30, 2024 / 04:05 AM IST

‘ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో నియమాలు పాటించాలి’

కడప: మారుతున్న సమకాలిన జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఫన్, ఫిట్, ఫుడ్ (f 3)ను పాటించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. పొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం ఫన్, ఫిట్, ఫుడ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మున్సిపల్ కమిషనర్ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య విషయంలో నియమాలు పాటించాలని, అప్పుడే ఆరోగ్యవంతులుగా జీవిస్తారన్నారు.

December 30, 2024 / 04:05 AM IST

ఏకసభ్య కమిషన్‌కు అభిప్రాయాలు తెలపవచ్చు: కలెక్టర్

GNTR: షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై విచారణకు శ్రీరాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏక సభ్య కమిషన్ సోమవారం గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాలుకు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యహ్నం 2 సభ్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. షెడ్యూల్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలను కమిషన్ సభ్యులకు తెలియజేయవచ్చని అన్నారు.

December 30, 2024 / 04:02 AM IST

బాపట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 

బాపట్ల: పట్టణంలో చీలు రోడ్డు సెంటర్ వద్ద ఆదివారం రాత్రి డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొని జరిమానాలు విధించారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

December 30, 2024 / 04:02 AM IST

ఆ వార్తలను ఖండించిన మాజీ మంత్రి

W.G: తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనిత ఖండించారు. ఎవరో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మార్పు విషయంలో వస్తున్న వార్తలు ఒట్టి వదంతులే అని కొట్టి పడేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సిగ్గు చేటని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.

December 30, 2024 / 04:02 AM IST

31న 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుంది: డీఎస్పీ

KRNL: ఈనెల 31న కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం అలాంటివి చేస్తే పదివేల రూపాయల జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని అన్నారు.

December 30, 2024 / 04:02 AM IST

నేడు ఒంటిమిట్టకు రానున్న టీటీడీ జేఈవో

కడప: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి నేడు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం విచ్చేయుచున్నట్లు ఒంటిమిట్ట ఆలయ టీటీడీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా జేఈవో కళ్యాణ వేదిక వద్ద అసంపూర్ణంగా ఉన్న హైలెవెల్ నీటి ట్యాంకును పరిశీలించి, నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఒంటిమిట్ట రామాలయానికి విచ్చేయునున్న భక్తులకు ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు.

December 30, 2024 / 04:02 AM IST