• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే

కోనసీమ: రాజోలు మండలంలోని రాజోలు, ములికిపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన పాల్గొని గ్రామానికి చెందిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.

March 2, 2026 / 06:40 PM IST

‘కొవ్వూరు నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి’

E.G: కొవ్వూరు నియోజవర్గంలోని దళితలకు ఉచితంగా సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, DSC కొరకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ కోరింది. ఈ మేరకు సోమవారం కొవ్వూరు రెవిన్యూ డివిజన్ అధికారిని శాఖ సభ్యులు పెనుమాక జయరాజు, కొప్పాక జవహర్, విజయానంద కుమార్ కలిసి వినతి పత్రం అందించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

March 2, 2026 / 06:38 PM IST

‘ఉగాది నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి’

PPM: జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల లక్ష్యాలను ఉగాది నాటికి సాధించాలని ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 34,965 గృహాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 20,859 గృహాలు పూర్తయ్యాయన్నారు.

March 2, 2026 / 06:36 PM IST

బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రజా వేదికలో 135 అర్జీలు

BPT: బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 135 అర్జీలు అందాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రజలు ఎన్నో ఆశలతో కార్యాలయానికి వస్తారని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన అర్జీలను 24 గంటల్లోనే పరిష్కరించి బాధితులకు తక్షణ ఊరట కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

March 2, 2026 / 06:35 PM IST

మన శివశంకర వరప్రసాద్ అర్థశత దినోత్సవ వేడుక సంబరాలు

VZM: మన శంకర వరప్రసాద్ సినిమా 50 రోజుల విజయోత్సవ వేడుకలను నగరంలోని హిమగిరి థియేటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా సెలబ్రేషన్స్‌లో ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.

March 2, 2026 / 06:35 PM IST

ఎస్పీ గ్రీవెన్స్‌కు 56 వినతులు

SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 56 అర్జీలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. వినతులను త్వరగా పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు.

March 2, 2026 / 06:32 PM IST

‘ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి’

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వీ. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సదుపాయాలు, పార్కింగ్, రవాణా, తదితర ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని సూచించారు.

March 2, 2026 / 06:31 PM IST

సేవల్లో నాణ్యత పెంచండి: చంద్రబాబు

GNTR: రాష్ట్రంలోని అన్ని శాఖలు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సమర్థత పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్‌, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 80 నుంచి 90 శాతం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 2, 2026 / 06:30 PM IST

సమస్యలను పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

NLR: బుచ్చి పట్టణంలోని రేబాల కాలువ చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధమైన వాసన వస్తుందని బీజేపీ నాయకులు నగర కమిషనర్ బాలకృష్ణకు తెలియజేశారు. పలు సమస్యలపై జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కాలువలో నీళ్లు ప్రవహించే విధంగా చెత్తను తొలగించాలన్నారు. మలిదేవి బ్రిడ్జి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.

March 2, 2026 / 06:30 PM IST

‘మీకోసం’లో 122 అర్జీలు

కృష్ణా: ప్రజల నుంచి అందే ‘మీకోసం’ అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని JC ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 122 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖలు సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

March 2, 2026 / 06:30 PM IST

‘పార్టీ నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే’

ప్రకాశం: దర్శి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం వంటి అంశాల గురించి వారితో చర్చించారు. గ్రామస్థాయి నుండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:30 PM IST

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

NDL: కొత్తపల్లి గ్రామ సమీపంలో నంద్యాల -ఆత్మకూరు రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు పల్సర్ బైక్‌ను ఢీకొనడంతో విశ్వ నగర్‌కు చెందిన నాగరాజు(43) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు వైపు వేగంగా వెళ్తున్న బస్సు బైక్ను ఢీకొట్టిందని తాలూకా పోలీసులు తెలిపారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 06:28 PM IST

జూద స్థావరంపై పోలీసులు దాడి

CTR: గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి జూదంపై దాడి నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, మరో ముగ్గురు పరారైనట్లు తెలిపారు. ఘటనాస్థలంలో రూ. 4,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. అందరూ రామాపురం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

March 2, 2026 / 06:25 PM IST

‘రబీ సీజన్‌కు జిల్లాలో యూరియా కొరత లేదు’

VZM: రబీ సీజన్ 2025-26కు జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అవసరమైన యూరియాలో ఎక్కువ భాగం సరఫరా కాగా, 5,398 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రబీ సీజన్‌లో ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేశారు. రైతులు మట్టిపరీక్ష ఆధారంగా సమతుల ఎరువులు వినియోగించాలని సూచించారు.

March 2, 2026 / 06:25 PM IST

‘పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి’

AKP: గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్ రాయవరం ఎంపీడీవో మీనా కుమారి డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటి పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 15వ తేదీలోగా శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 2, 2026 / 06:25 PM IST