ASR: బీమా ద్వారా కుటుంబానికి ధీమా లభిస్తుందని కొయ్యూరు గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గణేష్ తెలిపారు. ఇటీవల సహజ మరణం పొందిన, కోరుకొండ వెంకటలక్ష్మి, సోమెల మల్లమ్మ కుటుంబ సభ్యులకు బుధవారం రూ.2లక్షల చొప్పున బీమా సొమ్ము అందజేశారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి పధకంలో ఏడాదికి రూ.436 చెల్లిస్తే, సహజ మరణానికి రూ.2లక్షలు సొమ్ము కుటుంబానికి అందుతుందని తెలిపారు.
ELR: నిడమర్రు(మం) పెదనిండ్రకొలను, తోకలపల్లి బైనపల్లిలో బుధవారం జరిగిన అక్షర ఆంధ్ర ఫ్రీ టెస్ట్ పరీక్ష కేంద్రాన్ని ఏపీఎం ఎం. రత్నకుమార్ బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ సీసీ ఆర్ గౌరీశంకర్ ప్రసన్న, ముత్యాలు వలంటీర్లు, లెర్నెర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరక్షరాశులందరినీ అక్షరాసులుగా చేస్తున్నామని ఏపీఎం అన్నారు.
W.G: పాలకొల్లులో బుధవారం వివిధ పాఠశాలలోని టీచర్లను రాష్ట్ర ప్యాప్టో కార్యదర్శి ఎల్. సాయి శ్రీనివాస్ కలిశారు. టీచర్లు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ టీచర్లుతో సమానంగా మున్సిపల్ టీచర్లుకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ATP: గుత్తిలోని శ్రీ వాసవి కెపిఎస్ కళ్యాణ మండపంలో బుధవారం గౌతమ పురి ఖండ ఆధ్వర్యంలో సద్భావన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హిందువులంతా కులమతాలకు అతీతంగా ఒక్కటిగా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత కొరవడి దేశంలో అశాంతి నెలకొంటుందన్నారు. సమాజంలో సామాజిక సామరస్యత ముఖ్యమని పేర్కొన్నారు.
TPT: నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, యువతకు ఉపాధి కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. డిసెంబర్ 2025 నుంచి సింగిల్ డెస్క్ విధానంలో 2440 దరఖాస్తుల్లో 2323కు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 16 పరిశ్రమలకు రూ.4.52 కోట్ల ప్రోత్సాహకాలు ఆమోదించారు. APIIC ద్వారా కేటాయించిన భూములపై పరిశ్రమలు త్వరగా ప్రారంభించాలన్నారు.
కృష్ణా: మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీలో నిర్వహించిన మొదటి దశ ఇండ్ల జాబితా, ఇండ్ల గణన శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్ బాలాజీ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే మే నెల ఒకటవ తేదీ నుంచి చేపట్టనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని ఎలాంటి తప్పులు లేకుండా సజావుగా పూర్తి చేయాలని గణన ఛార్జ్ అధికారులను ఆదేశించారు.
NLR : బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి దేవస్థానానికి శ్రీకాళహస్తి వాస్తవ్యులు మహంకాళి రాఘవేంద్రరావు, ప్రసన్నలక్ష్మి నిత్య అన్నదానానికి విరాళం అందజేశారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డికి 50 వేల రూపాయలు అందజేశారు. దాతలకు ప్రత్యేక పూజలు చేయించి, శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఎమ్మిగనూరు లక్ష్మీపేట, సంజీవ్ నగర్ కాలనీల్లో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ. సుధాకర్ ఆధ్వర్యంలో, డాక్టర్ శారద నేతృత్వంలో వైద్యులు సేవలు అందించారు. మాజీ కౌన్సిలర్ రామకృష్ణ నాయుడు సహకారంతో రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు.
అన్నమయ్య: రాయచోటిలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. పోలీస్ అధికారులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
సత్యసాయి: పరిగి మండలం శ్రీరంగరాజుపల్లిలో శ్రీ సద్గురు తాతయ్య స్వామి దర్గాలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫై మ్యాన్ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, సోమప్ప, బాలాజీ, సంజీవరాయప్పతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రకాశం: పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. బుధవారం సి ఎస్ పురం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం స్టేషన్లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో వృద్ధురాలను గాయపరిచి డబ్బులతో పరారైన నిందితుడిని అరెస్ట్ చేశామని ఏఎస్పీ మనీషా రెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28న గ్రామానికి చెందిన తేరేజమ్మను తీవ్రంగా గాయపరిచి పరారైన వ్యక్తిపై కేసు నమోదు చేసి 3 టీమ్లుగా గాలించామన్నారు. ఈరోజు అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తిని పట్టుకున్నారు.
కడప జిల్లాలోని దువ్వూరు మండలం కృష్ణంపల్లి ఉరుసు సందర్భంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలను నివారించేందుకు దువ్వూరు ఎస్సై ధనంజయుడు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
SKLM: టెక్కలి మండలం తలగాం సమీపంలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ విద్యార్థిని టెక్కలి-నౌపడ వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: మార్చి 10, 11న పుంగనూరులో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయం అవసరమని మున్సిపల్ ఛైర్మన్ ఆలీమ్ భాష అన్నారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి అని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తగు సూచనలు సలహాలు ఇచ్చి దిశా నిర్దేశం చేశారు.