• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

యమున నది పుష్కరాలకు ప్రత్యేక రైలు సర్వీస్

తూ.గో: వేసవి సెలవుల దృష్ట్యా IRCTC ప్రత్యేక ప్యాకేజీతో పాటు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడుపుతోందని ఏరియా మేనేజర్ ఎం రాజా వెల్లడించారు. బుధవారం రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆయన మాట్లాడారు. జూన్ 3న సికింద్రాబాద్ నుంచి అయోధ్య, కాశీ, యమున పుష్కరాలను కవర్ చేస్తూ ప్రత్యేక రైలు వెళ్లనుందని తెలిపారు. యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

February 25, 2026 / 08:07 PM IST

జిల్లా స్థాయిలో మాధవరాయుడుపాలెం విద్యార్థులు ప్రతిభ

E.G: రాజమండ్రి SKVT కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ పోటీల్లో మాధవరాయుడుపాలెం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. పద్య పఠనంలో 5వ తరగతి విద్యార్థిని తాండ్ర రేణుశ్రీ ప్రథమ స్థానం, తెలుగు వక్తృత్వంలో 9వ తరగతి విద్యార్థిని కె.జాహ్నవి ద్వితీయ స్థానం సాధించారు. బుధవారం విజేతలకు DEO కె.వాసుదేవరావు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు.

February 25, 2026 / 08:06 PM IST

పంతలచింత గ్రామంలో కార్డన్ సెర్చ్

ASR: గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు సీఐ ఎల్.హిమగిరి, డుంబ్రిగుడ ఎస్సై సురేష్ హెచ్చరించారు. బుధవారం డుంబ్రిగుడ మండలంలోని పోతంగి పంచాయతీ పంతలచింత గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా తమ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి తనిఖీలు నిర్వహించారు. అనంతరం, గ్రామస్తులతో సమావేశమయ్యారు.

February 25, 2026 / 08:06 PM IST

జిల్లా పరిషత్ హై స్కూల్‌ను సందర్శించిన డీఈవో

NTR: కంచికచర్ల మండల పరిధిలోని పెండ్యాల జిల్లా పరిషత్ హై స్కూల్‌ను DEO చంద్రకళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల బోధన విధానం, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు 100 డేస్ ప్రణాళికను కచ్చితంగా పాటించాలని సూచించారు. సమయపాలనతో చదువుకు ప్రాధాన్యత ఇచ్చి పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపాలన్నారు.

February 25, 2026 / 08:05 PM IST

అమర జవాన్ సైదా నాయక్ విగ్రహ ఆవిష్కరణ

PLD: మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో ఆర్మీ జవాన్‌ బాణావత్ సైదా నాయక్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచవరం ఎస్సై కె పవన్ కుమార్ పాల్గొన్నారు. అమర జవాన్ కుటుంబ సభ్యులు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

February 25, 2026 / 08:03 PM IST

ఈనెల 28 నుంచి శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

BPT: శనగ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి శనగ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. క్వింటా శనగలకు రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తున్నామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

February 25, 2026 / 08:03 PM IST

బస్ స్టాప్ అడ్డంగా పడిన ఫ్లెక్సి

VZM: కొత్తవలసలో బుధవారం వీచిన ఈదురుగాలులకు విశాఖ వెళ్లే బస్ స్టాప్ వద్ద ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుల ఫ్లెక్సీ పడిపోయింది. ఆసమయంలో బస్ స్టాప్ వద్ద ప్రయాణికులు లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఫ్లెక్సీ అడ్డంగా ఉండడం వలన ప్రయాణికులు బస్సులు ఎక్కడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు ఫ్లెక్సీని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

February 25, 2026 / 08:02 PM IST

పీ-4 ద్వారా 65 శాతం వెరిఫికేషన్ పూర్తి

ఏలూరు జిల్లాలో పీ-4 కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 65% బంగారు కుటుంబాల ధ్రువీకరణ పూర్తయిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. అమరావతి నుంచి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పియూష్ కుమార్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో గుర్తించిన 71,910 బంగారు కుటుంబాల్లో, ఇప్పటికే 5,554 మంది మార్గదర్శకులు 43,814 కుటుంబాలను దత్తత తీసుకున్నారన్నారు.

February 25, 2026 / 08:01 PM IST

నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు

NDL: రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు నంద్యాల ఎంపీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా. బైరెడ్డి శబరికి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పునర్వికకు పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 50 లక్షల వైద్య సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సేవా గణేష్ నాయక్ సన్ని, కుమార్, మహేంద్ర మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 08:00 PM IST

స్వచ్ఛ మంగళగిరి 2.0 పోస్టర్లను ఆవిష్కరన

GNTR: మంగళగిరి నియోజకవర్గాన్ని పరిశుభ్రతలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో “స్వచ్ఛ మంగళగిరి 2.0” పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. మొదటి దశ ప్రజల్లో మంచి చైతన్యం తెచ్చిందని, రెండో దశలో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిని పూర్తిస్థాయిలో స్వచ్ఛంగా మార్చాలన్నారు.

February 25, 2026 / 08:00 PM IST

డెలివరీ బాయ్ అనుభవాన్ని అసెంబ్లీలో పంచుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: డెలివరీ బాయ్‌గా తన అనుభవాలను అసెంబ్లీలో పెనమలూరు MLA బోడె ప్రసాద్ బుధవారం పంచుకున్నారు. ఇతర దేశాల్లో డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చిన్నతనంగా చూడకుండా అందరూ చేస్తారని అదే స్ఫూర్తిని ఇక్కడ యువతలో నింపాలని తాను డెలివరీ బాయ్‌గా చేసినట్లు తెలిపారు. డెలివరీ బాయ్స్‌కి కంపెనీల వద్ద టాయిలెట్స్, నుంచోడానికి నీడ వంటి సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

February 25, 2026 / 08:00 PM IST

ఈ నెల 28నే పింఛను పంపిణీ

ASR: ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చ్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఈ నెల 28న పంపిణీ చేస్తారని అరకులోయ ఎంపీడీవో అడప లవరాజు పేర్కొన్నారు. కావున ఫించను లబ్ధిదారులు శనివారం వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని అన్నారు. మండలంలో ఉన్న 6359 ఫించన్లకు రూ.2.75 కోట్లు మంజూరైనట్లు బుధవారం తెలిపారు. సిబ్బంది ఈ నెల 27న పింఛను అమౌంట్ బ్యాంకు నుండి వితడ్రా చేయాలన్నారు.

February 25, 2026 / 07:59 PM IST

సర్వే తనిఖీ చేసిన ఎంపీడీవో

CTR: వెదురుకుప్పం సచివాలయ పరిధిలో జరుగుతున్న ఏకీకృత సర్వేని ఎంపీడీవో పురుషోత్తం బుధవారం తనిఖీ చేశారు. పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. రిజిస్టర్లు, ఫుడ్ స్టాక్ వివరాలను ఆరా తీశారు. సకాలంలో పౌష్టికాహారం పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సిబ్బంది రిషి, జయసుధ, నీరజ పాల్గొన్నారు.

February 25, 2026 / 07:49 PM IST

‘జనసేన బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి’

SKLM: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని జనసేన నాయకులు డా.దానేటి శ్రీధర్ అన్నారు. బుధవారం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఈనెల 26 నుండి ప్రారంభంకానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమని అన్నారు.

February 25, 2026 / 07:44 PM IST

‘కల్తీ ఆహారంపై కఠిన చర్యలు తీసుకోండి’

TPT: కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఎంపీ గురుమూర్తి ఆదేశించారు. అంగన్‌వాడీలు, డెయిరీలు,హోటళ్లు, స్వీట్లు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించాలని, కల్తీ నిర్ధారణైతే చర్యలు తీసుకోవాలని, పునరావృతమైతే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు‌.

February 25, 2026 / 07:40 PM IST