ప్రకాశం: కంభం పట్టణంలోని పలు దుకాణాలలో శుక్రవారం ఎంపీడీవో వీరభద్రాచారి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా తగ్గిన నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.