VZM: ఢిల్లీలోని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హౌస్లో స్పీకర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో భాగమైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును స్పీకర్కు పరిచయం చేశారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు.