W.G: ఈనెల 14న వండర్ కిడ్స్ స్కూల్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. పట్టణంలోని 10 మంది వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తారు. తహశీల్దార్ రావి రాంబాబు బుధవారం కార్యాలయంలో శిబిరం పోస్టర్ను ఆవిష్కరించి, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డా గజపతిరాజు, అల్లు రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.