శ్రీకాకుళం మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్గా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో అతిసారం ప్రబలేందుకు బాధ్యులను చేస్తూ కమిషనరు హెచ్. కూర్మారావును బుధవారం సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.