కడపలో జనగణన–2027 అవగాహనలో భాగంగా నిర్వహించిన 5K రన్లో ఎమ్మెల్యే మాధవి, టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువత, నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి సెవెన్ రోడ్స్ వరకు రన్ నిర్వహించారు. ఆరోగ్యకర జీవనశైలి ప్రాముఖ్యతను నేతలు వివరించారు.