KDP: కమలాపురం మండలం ఆగస్తలింగాయపల్లెలో ఐదు రోజులుగా తాగునీటి కొరత తీవ్రమైంది. దీనిపై గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించాలని కొండారెడ్డి నేతృత్వంలో పలువురు మహిళలు అధికారులను కోరుతున్నారు.