BPT: రంజాన్ సందర్భంగా పిట్టలవానిపాలెం మండలం చందోలులోని ఈద్గా వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ప్రార్థనల దృష్ట్యా ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని సూచించారు.