W.G: పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 ఏళ్లకు ఒకసారి సేవ్ ది గర్ల్ చైల్డ్ అంశంపై 2కే రన్ నిర్వహిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం జరిగే కార్యక్రమానికి మంత్రి అనిత, కలెక్టర్ నాగరాణి, ఏపీ టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి, సినీ గాయని మధుప్రియ హాజరవుతారన్నారు.