SKLM: ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీ శాంతి శ్రీ ఆదేశించారు. గురువారం నరసన్నపేట మండల కేంద్రంలోని బండి వీధి వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడ నిర్వహిస్తున్న అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అలాగే చదువుతోపాటు పౌష్టిక ఆహారం కూడా అందించాలన్నారు.