ELR: ఏడాది పాలనలోనే ఎన్నో విజయాలు సాధించామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. గురువారం ఆగిరిపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలో నెక్కలం గొల్లగూడెంలో ఎంపీ లాడ్స్ నిధులు రూ.30 లక్షలతో నిర్మించే యాదవ కమ్యూనిటీ హాల్, నాబార్డు నిధులు రూ.1.50 కోట్లతో ఈదర నుండి శోభనాపురం రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు.