KRNL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అయినందున కర్నూలులో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.