కృష్ణా: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని టీడీపీ చల్లపల్లి మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు అన్నారు. గురువారం చల్లపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. డీసీ ఛైర్మన్ దిలీప్, ఏఎంసీ ఛైర్మన్ కనకదుర్గ, సర్పంచ్ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.