AKP: నర్సీపట్నం పట్టణం 6వ వార్డులో ట్రాన్స్ఫార్మర్ పేలుడు సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు వస్తున్నా, విద్యుత్ శాఖ అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. ఈ రోజు రాత్రి ఆ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి.