KRNL: గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఇవాళ ఎమ్మిగనూరులో సంబరాలు జరుపుకున్నారు. సీఎం చంద్రబాబును సైతం జైలుకు పంపిన నీచమైన బుద్ధి వైసీపీ నాయకులదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా తిరిగే రోజులు మళ్ళీ వచ్చాయని తెలిపారు.