JN: చిలుపూరు మండలం చిన్న పెండ్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఫర్టిలైజర్ షాప్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.