KMM: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన అందిస్తుందని మండల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ముదిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునః ప్రారంభోత్సవంలో స్పెషల్ ఆఫీసర్ పాల్గొని మాట్లాడారు. తాను చదువుకునే రోజుల్లో అనేక ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.