గత 11 ఏళ్లలో సాంకేతిక వినియోగంతో ప్రజలు అపరిమిత ప్రయోజనాలు పొందారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత యువశక్తి ఆవిష్కరణలు, సాంకేతికతతో అద్భుత పురోగతి సాధ్యమైందని ఆయన అన్నారు. దీంతో స్వావలంబన, ప్రపంచ సాంకేతిక శక్తి కేంద్రంగా భారత్ను మార్చాలనే తమ ప్రయత్నం బలోపేతమవుతోందని మోదీ ‘X’లో పోస్ట్ చేశారు.