ELR: గ్రామాల్లో రోడ్డు అభివృద్ధి చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. గురువారం ఉంగుటూరు నుంచి నాచుగుంట వంతెన వరకు రూ.55 లక్షలతో వేసిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు, ఎంపీడీఓ మనోజ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.