E.G: కొవ్వూరు మండలం వాడపల్లి-బంగారమ్మపేట దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వెంటనే స్పందించారు. ఘటనలో గాయాల పాలైన బాధితులను హుటాహుటిన కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించి హాస్పటల్ సూపరింటెంట్కి ఫోన్ చేసి మెరుగైన అత్యవసర చికిత్స అందించమని ఆదేశించారు.