కడప: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు పోలీసుల పటిష్ట బందోబస్తుతో కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధిస్తూ కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాల రవాణాకు ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.