TPT: నాయుడుపేట మండలంలో గత వారం కన్నా ఈ వారం చికెన్ ధరలు తగ్గాయి. బాయిలర్, ఫారం కోడి గత వారం రూ. 300 పలుకగా ఈ వారం రూ.240కి తగ్గింది. కిలో మటన్ రూ.800-900 పలుకుతోంది. అలాగే కేజీ కొరమేను చేపలు రూ.250-రూ.300 వరకు ఉంది. మాంసం ధరలు తగ్గడంతో మాంసాహార ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.