GNTR: గుంటూరులోని సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద తాగునీటి పైప్లైన్కు ఇంటర్ కనెక్షన్ పనులు వేగవంతం అయ్యాయి. సోమవారం కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ పనులను గడువులోగా పూర్తి చేసి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అధికారులు పని ప్రదేశంలోనే ఉండి పనులను పర్యవేక్షించాలని సూచించారు.