ప్రకాశం: ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త గౌస్ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను అర్పించాడన్నారు.